Delhi Liquor Scam : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాంలో కీలక మార్పు చోటు చేసుకుంది. రూ. 5 కోట్ల లంచం కేసులో అసిస్టెంట్ డైరెక్టర్, ఇతరులపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీ, మద్యం వ్యాపారి అమన్దీప్ ధాల్, క్లారిడ్జెస్ హోటల్ సీఈఓ ఈ కేసులో బుక్ అయ్యారు.
Delhi Liquor Scam Viral
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో సహాయం కోరిన మద్యం వ్యాపారి అమన్దీప్ ధాల్ రూ. 5 కోట్లు చెల్లించారనే ఆరోపణలపై ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
వీరిద్దరితో పాటు ఎయిర్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ దీపక్ సంగ్వాన్, క్లారిడ్జెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సీఈఓ విక్రమాదిత్య, చార్టర్డ్ అకౌంటెంట్ ప్రవీణ్ కుమార్ వాట్స్, మరో ఇద్దరు నితేష్ కోహర్, EDలో UDC, బీరేందర్లను కూడా ఉన్నట్లు సీబీఐ వెల్లడించింది ఈడీ.
ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ స్కామ్పై విచారణ సందర్భంగా ఈ కేసులో నిందితుడైన అమన్దీప్ ధాల్ ఆయన తండ్రి బీరేందర్ పాల్ సింగ్ రూ. 5 కోట్ల లంచం ఇచ్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫిర్యాదు మేరకు సీబీఐ చర్యలు ప్రారంభించింది. చార్టర్డ్ అకౌంటెంట్ ప్రవీణ్ వాట్స్ ఈడీ విచారణలో సహాయం అందించారని పేర్కొంది.
Also Read : CM KCR : సాంస్కృతిక సారథి ఉద్యోగులకు గుడ్ న్యూస్