KTR Bobby Reddy : క్యాన్సర్ ఆస్పత్రి..పరిశోధన కేంద్రం
మంత్రితో భేటీ అయిన పై హెల్త్ కో ఫౌండర్ బాబీ రెడ్డి
KTR Bobby Reddy : హైదరాబాద్ లో మరో కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్(KTR) ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు గాను కేటీఆర్ యూఎస్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా దిగ్గజ కంపెనీల సిఇఓలు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు , ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, ఔత్సాహికులు, టెక్ ఎక్స్ పర్ట్స్ తో భేటీ అయ్యారు. ఇప్పటికే పలు కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఓకే చెప్పాయి. దాదాపు కొత్త కంపెనీల ఏర్పాటుతో 32,000 మందికి ఉపాధి దక్కనుందని సమాచారం.
ఈ విషయాన్ని స్వయంగా ఐటీ మినిష్టర్ వెల్లడించారు. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు పై హెల్త్ కో ఫౌండర్ డాక్టర్ బాబీ రెడ్డి. ఆయన ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో ప్రత్యేకంగా అమెరికాలో కలిశారు. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేశారు. బోస్టన్ లో , హైదరాబాద్ లో సమీకృత క్యాన్సర్ ఆస్పత్రితో పాటు , పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఈ రెండింటిని ఏర్పాటు చేయడం వల్ల భారీ ఎత్తున ఉద్యోగాలు రానున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో అత్యాధునిక టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్ ,రీసెర్చ్ సెంటర్ ను స్థాపించాలని పై హెల్త్ నిర్ణయించడం ఆనందంగా ఉందన్నారు కేటీఆర్.
Also Read : Anil Kumble