Laxman Savadi : డీకే శివకుమార్ తో లక్ష్మణ్ సవాది భేటీ
కాంగ్రెస్ పార్టీలో చేరనున్న బీజేపీ నేత
Laxman Savadi DK : భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్రకటించిన జాబితాలో తమ పేర్లు లేక పోవడంతో పలువురు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కు వీర విధేయుడిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది బీజేపీకి గుడ్ బై చెప్పారు.
ఆయన రాష్ట్రంలో ప్రభావం చూపే లింగాయత్ కమ్యూనిటీకి చెందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. వీరి ఓట్ల శాతం ఎక్కువగా ఉంది. యెడ్డీ కూడా ఇదే వర్గానికి చెందిన వారు. బీజేపీలో రెండో అత్యంత ప్రభావంతమైన లింగాయత్ నాయకుడిగా ఉన్నారు లక్ష్మణ్ సవాది(Laxman Savadi).
శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. లక్ష్మణ్ సవాది కర్ణాటక ప్రదేశ్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ , మాజీ సీఎం సిద్దరామయ్యతో సమావేశం అయ్యారు. ఆయన భేటీ కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. లింగాయత్ ఓట్లను ప్రభావితం చేయడంలో, ఓట్లను చీల్చడంలో ప్రధానంగా మారనున్నారు లక్ష్మణ్ సవాది.
ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సిద్దరామయ్య గృహంలో ఆయన భేటీ కావడం కలకలం రేపింది. మే 10న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ జాబితాలో పేరు లేక పోవడంతో తప్పుకున్నారు. లక్ష్మణ్ సవాదికి(Laxman Savadi DK) అవమానం జరిగింది. సీనియర్లకు తాము స్వాగతం పలుకుతున్నామని స్పష్టం చేశారు డీకే శివకుమార్.
Also Read : అస్సాంకు చేరుకున్న పీఎం మోదీ