Rishi Sunak : భార‌త్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం – సున‌క్

జీ20 శిఖరాగ్ర సద‌స్సులో ప్ర‌ధాని మోదీతో చర్చ‌లు

Rishi Sunak : భార‌త దేశంతో బ్రిట‌న్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కొన‌సాగించేందుకు మొగ్గు చూపుతుంద‌న్నారు నూత‌న ప్ర‌ధాని రిషి సున‌క్. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన టి20 శిఖరాగ్ర స‌ద‌స్సు వివ‌రాలు శుక్ర‌వారం వెల్ల‌డించారు. రిషి సున‌క్(Rishi Sunak) మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధానంగా వ్యాపార, వాణిజ్యానికి సంబంధించి చ‌ర్చించ‌డం జ‌రిగింద‌ని చ‌చెప్పారు.

ఈ చ‌ర్చ‌లు అత్యంత ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో జ‌రిగాయ‌ని తెలిపారు. వీలైనంత త్వ‌ర‌లో మ‌రోసారి భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యే అవ‌కాశం లేక పోలేద‌న్నారు. ఇరు దేశాలు ఇక నుంచి ఎప్ప‌టి లాగే ముందుకు వెళ‌తాయ‌ని ఇందులో ఎలాంటి అనుమానం లేద‌న్నారు రిషి సున‌క్.

ఇందులో భాగంగానే ఇప్ప‌టి దాకా భార‌త్ తో కొన‌సాగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్ప‌దం (ఎఫ్టిఓ) చ‌ర్చ‌ల‌ను విజ‌య‌వంతంగా ముగించే దిశ‌గా యుకె ప్ర‌భుత్వం సాధ్యమైనంత త్వ‌ర‌గా ప‌ని చేసేందుకు క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు యుకె పీఎం.

ఇదిలా ఉండ‌గా భార‌త దేశంతో ఒప్పందం పూర్త‌య్యే స‌మ‌య పాల‌న‌పై ప్ర‌తిప‌క్ష లేబ‌ర్ పార్టీ నాయ‌కుడు కీర్ స్టార్మ‌ర్ పీఎంను ప్ర‌శ్నించారు. కొన్ని అంశాలు బ‌య‌ట‌కు చెప్ప‌లేం. ఎందుకంటే కొన్నింటిని మాత్ర‌మే తెలియ చేయాల్సి ఉంటుంద‌న్నారు రిషి సున‌క్(Rishi Sunak). గ‌తంలో యుకెకు న‌మ్మ‌క‌మైన మిత్ర దేశంగా భార‌త్ ఉంద‌న్నారు.

ఇక ముందు కూడా ఉంటుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు పీఎం. వాణిజ్య ఒప్పందాలు మ‌రింత మెరుగైన రీతిలో కొన‌సాగేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

భార‌త దేశం నుండి యువ‌కులు ఇక్క‌డికి రావ‌డానికి బ్రిటీష్ యువ‌కులు ఇండియాకు వెళ్లేందుకు మొబిలిటి ప‌థ‌కాన్ని ప్రక‌టించామ‌ని చెప్పారు రిషి సున‌క్. 30 ఏళ్ల లోపు వారికి ప్ర‌తి ఏటా 3,000 కొత్త ప‌రస్ప‌ర వీసాల‌ను మంజూరు చేస్తామ‌న్నారు.

Also Read : పాకిస్తాన్ కామెంట్స్ భార‌త్ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!