Gaurav Gogoi : మ‌ణిపూర్ కాలిపోతోంది – గౌర‌వ్ గొగోయ్

ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఎంపీ

Gaurav Gogoi : ఇవాళ మ‌ణిపూర్ కాలిపోతోంది. రేపు దేశం కాలి పోద‌న్న న‌మ్మ‌కం ఏమిట‌ని ప్ర‌శ్నించారు కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గొగోయ్ . మంగ‌ళ‌వారం మ‌ణిపూర్ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా అల‌య‌న్స్ పార్టీల స‌భ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు.

Gaurav Gogoi Words About Manipur

ఇవాళ మ‌ణిపూర్ ఈ దేశంలో ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌ని ఆవేద‌న చెందారు గొగోయ్(Gaurav Gogoi). యావ‌త్ మ‌ణిపూర్ వాసులంతా త‌మ‌కు న్యాయం కావాల‌ని కోరుతున్నార‌ని, వారి గొంతు లోని బాధ‌ను మాత్ర‌మే తాను ఇక్క‌డ ప్ర‌స్తావిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ.

క‌నీసం మ‌ణిపూర్ రాష్ట్రానికి జ‌రిగిన గాయం గురించి మాట్లాడేందుకైనా అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది ఉందా అని ప్ర‌శ్నించారు. ఇవాళ కేంద్రంలో మీరే ఉన్నారు..రాష్ట్రంలో మీ ప్ర‌భుత్వం కొన‌సాగుతోంది.. మ‌రి ఎందుకు మ‌ణిపూర్ మండుతోంద‌ని నిల‌దీశారు.

మ‌ణిపూర్ కాలి పోతుందంటే దాని అర్థం దేశం కూడా కాలి పోతోంద‌ని అన్నారు. అందుకే ఇవాళ దాని గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సి వ‌స్తోంద‌ని, మాట్లాడాల్సి వ‌స్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక‌నైనా మోదీ ,సీఎం క‌ళ్లు తెర‌వాల‌ని అన్నారు.

Also Read : Daggubati Purandeswari : టీటీడీ రాజ‌కీయ పున‌రావాసం కాదు

Leave A Reply

Your Email Id will not be published!