The Kerala Story : ది కేర‌ళ స్టోరీకి ప‌న్ను మిన‌హాయింపు

మ‌ధ్య ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న

The Kerala Story : దేశ వ్యాప్తంగా వివాదానికి దారి తీసిన ది కేర‌ళ స్టోరీకి ఖుష్ క‌బ‌ర్ చెప్పింది మ‌ధ్య ప్ర‌దేశ్ లోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే ఈ సినిమా గురించి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కితాబు ఇచ్చారు. ప‌దే ప‌దే ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డంతో ఎంపీ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు త‌మ రాష్ట్రంలో ప్ర‌ద‌ర్శించేందుకు వీలుగా ది కేర‌ళ స్టోరీ(The Kerala Story) చిత్రానికి ప‌న్ను మినహాయింపు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా తాజాగా క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ది కేర‌ళ స్టోరీపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఉగ్ర‌వాద కుట్ర‌ల‌ను అద్భుతంగా తెర మీద ప్ర‌తిఫ‌లించేలా చేశారంటూ తెలిపారు. ఇదే స‌మ‌యంలో కేర‌ళ‌లో అధికారంలో ఉన్న సీపీఎంతో పాటు సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర అభ్యంత‌రం తెలిపాయి. ఈ త‌రుణంలో మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపింది.

శ‌నివారం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంంది. మ‌ధ్య ప్ర‌దేశ్ లో మ‌త మార్పిడికి వ్య‌తిరేకంగా ఇప్ప‌టికే చ‌ట్టం తీసుకు వ‌చ్చామం. ఈ సినిమా ఇందులో భాగంగా అవ‌గాహ‌న క‌ల్పిస్తుందన్నారు. ప్ర‌తి ఒక్క‌రు ఈ సినిమా చూడాల‌ని పిలుపునిచ్చారు సీఎం శివ రాజ్ సింగ్ చౌహాన్.

Also Read : మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే హ‌త్య‌కు కుట్ర

Leave A Reply

Your Email Id will not be published!