Harish Rao : నారాయణ ఖేడ్ – తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలుపు చూసి వాపు అనుకుంటుందోంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao). ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరపున రోడ్ షో చేపట్టారు. ఈ సందర్బంగా ప్రసంగించారు. నియోకవర్గంలోని ప్రజల ఆశీర్వాదంతో భూపాల్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు.
Harish Rao Comments on Congress
ర్యాలీకి స్వచ్చంధంగా వచ్చిన ప్రజలను చూస్తేనే ఇక మెజారిటీ మీదనే తమ ధ్యాస ఉందన్నారు. అశేష ప్రజానాన్ని చూసిన కాంగ్రెస్ పార్టీ గుండెలు జారి పోయాయని ఎద్దేవా చేశారు. 30న పోలింగ్ ఎలా ఉంటుందో ఇప్పటికే అర్థమై పోయిందన్నారు. కనీసం తమకు ఇక్కడ 50 వేలకు పైగా మెజారిటీ రావడం ఖాయమని జోష్యం చెప్పారు తన్నీరు హరీశ్ రావు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలను నమ్మిన రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మల్లికార్జున్ ఖర్గే వచ్చి తెలంగాణకు మేం పెట్టిన భిక్ష అన్నారని ఇది మంచి పద్దతేనా అని ప్రశ్నించారు ఆరోగ్య, ఆర్థిక మంత్రి.
సొంత రాష్ట్రంలో నీళ్లు, రోడ్లు లేకున్నా ఎందుకు స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పత్తా లేకుండా పోయారంటూ ఎద్దేవా చేశారు.
Also Read : Jonnalagadda Snehaja : రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ గా స్నేహజ