Ajit Pawar : షిండే అడిగితే సీఎం పదవి దక్కేది – అజిత్ పవార్
మాజీ డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్
Ajit Pawar : మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మంత్రిగా కొలువు తీరిన ఏక్ నాథ్ షిండే చేసిన తిరుగుబాటు బాగో లేదని పేర్కొన్నారు మాజీ డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) .
మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ కొత్తగా సీఎంగా కొలువు తీరిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శాసనసభలో డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను త్వరలోనే మరాఠాకు తిరిగి వస్తానని చెప్పానని, అలాగే ఏక్ నాథ్ షిండేతో వచ్చానని అన్నారు. తాము విమర్శలు పట్టించు కోమన్నారు. ప్రతి దానికి వివరణ ఇచ్చుకుంటూ పోతే విలువైన సమయం చాలదన్నారు.
ఇదిలా ఉండగా అజిత్ పవార్ అసెంబ్లీలో మాట్లాడారు. సీఎంగా కొలువు తీరిన శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండేకు అభినందనలు తెలిపారు. ఆపై ధన్యవాద తీర్మానం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రిగా ఉన్న సమయంలో ఏక్ నాథ్ షిండే(EkNath Shinde తన వద్దకు వచ్చి సీఎం పదవి కావాలని ఉందని చెప్పి ఉంటే తానే స్వయంగా ఉద్దవ్ ఠాక్రేను ఒప్పించి సీఎం పీఠం పై కూర్చో బెట్టే వాడినంటూ చెప్పారు.
కానీ ఏక్ నాథ్ షిండే నాపై ఆరోపణలు చేశారు. నిధులు ఇవ్వలేదన్నారు. నావద్దే ఉన్నాయంటూ పేర్కొన్నారు. అవన్నీ నిరాధారమైనవి మాత్రమేనని చెప్పగలనని అన్నారు అజిత్ పవార్.
ఇదిలా ఉండగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోదరుడే ఈ అజిత్ పవార్. తిరుగుబాటు సందర్భంగా ఏక్ నాథ్ షిండే అజిత్ పవార్ పై కూడా సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : వాళ్లను క్షమిస్తా ప్రతీకారం తీర్చుకోను