Chandrababu Naidu : అధికారం అప్ప‌గిస్తే అభివృద్ది చూపిస్తా

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu : ఇవాళ రాష్ట్రం ద‌శ దిశ లేకుండా సాగుతోంది. పాల‌న అస్త‌వ్య‌స్తంగా మారింది. నాకు అధికారాన్ని క‌ట్ట‌బెట్టండి. ప‌వ‌ర్ ఏమిటో చూపిస్తా. పాల‌నా ప‌రంగా ప‌రుగులు పెట్టిస్తా. ఏపీ బాగు ప‌డాలంటే త‌మ పార్టీని గెలిపించాల‌ని అన్నారు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu).

త‌న‌కు రాబోయే ఎన్నిక‌లే చివ‌రి ఎన్నిక‌లు అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. దేశంలోనే అత్యంత సీనియ‌ర్ నాయ‌కుల‌లో నేను ఒక‌డిగా ఉన్నా. దాదాపు 40 ఏళ్ల పాటు రాజ‌కీయాల్లో మ‌చ్చ లేకుండా ప‌ని చేశా. కానీ ఏపీలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌చ్చాక అరాచ‌కంగా ప్ర‌వ‌ర్తించారు.

న‌న్ను అన‌రాని మాట‌లు అన్నారు. ఆపై హేళ‌న చేశారు. అవ‌మానానికి గురి చేశారు. ఆపై నా భార్య‌ను కూడా అన‌రాని మాట‌లు అన్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు చంద్ర‌బాబు నాయుడు. అయినా నేను ఓర్చుకున్నా, త‌ట్టుకుని నిల‌బ‌డ్డా . నా కోసం కాదు. నా కుటుంబం కోసం కాదు.

కేవ‌లం ఏపీ రాష్ట్రం మీద ఉన్న ప్రేమ‌తో, గౌర‌వంతో భ‌రించాన‌ని అన్నారు. అందుకే తాను అసెంబ్లీకి రానంటూ శ‌ప‌థం చేశాన‌ని చెప్పారు.

అది గౌర‌వ స‌భ కాదు కౌర‌వ స‌భ అంటూ ఆరోపించారు టీడీపీ చీఫ్‌. నేను అసెంబ్లీకి వెళ్లాల‌న్నా రాష్ట్రానికి న్యాయం జ‌ర‌గాలంటే నాకు అధికారం అప్ప‌గించాల‌ని కోరారు నారా చంద్ర‌బాబు నాయుడు.

కర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవే ఆఖ‌రు ఎన్నిక‌లు అవుతాయ‌ని పేర్కొన్నారు.

Also Read : ఎవ‌రీ క‌నికా ఏమిటా క‌థ

Leave A Reply

Your Email Id will not be published!