G20 Summit Delhi : జి20 స‌ద‌స్సుకు భార‌త్ ఆతిథ్యం

డిసెంబ‌ర్ లో జరిగే అవ‌కాశం

G20 Summit Delhi :  ఈ ఏడాది డిసెంబ‌ర్ లో ప్రారంభం కానున్న జి20 స‌ద‌స్సుకు భార‌త దేశం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. జి20 అధ్య‌క్ష ప‌ద‌విని రెండుసార్లు మార్చుకున్న త‌ర్వాత భార‌త్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నుంది.

మొద‌ట 2021లో నిర్వ‌హించ‌గా 2022లో ఇండోనేషియాలో నిర్వ‌హించారు. ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది డిసెంబ‌ర్ నుండి జి20 అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్ట‌నుంది, న్యూఢిల్లీ(G20 Summit Delhi) ఇది వేదిక కానుంది.

ప్ర‌పంచంలోని 20 అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల నాయ‌కుల శిఖరాగ్ర స‌మావేశానికి ఆథిత్వం ఇవ్వ‌నుంది. న‌వంబ‌ర్ లో లీడ‌ర్స్ స‌మ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వ‌నున్న ఇండోనేషియా నుంచి ఏడాది పాటు జి20 అధ్య‌క్ష ప‌ద‌విని భార‌త్ చేప‌ట్ట‌నుంది.

డిసెంబ‌ర్ 1 , 2022 నుండి న‌వంబ‌ర్ 30, 2023 వ‌ర‌కు దేశ అధ్య‌క్ష ప‌ద‌విని నిర్వ‌హిస్తారు. డిసెంబ‌ర్ లో ప్రారంభ‌మ‌య్యే దేశ వ్యాప్తంగా 200 కంటే ఎక్కువ స‌న్నాహ‌క , ఇత‌ర స‌మావేశాల‌ను నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు.

ఈ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు త‌మిళ‌నాడు నుంచి కేంద్ర పాలిత ప్రాంతం జ‌మ్మూ కాశ్మీర్ వ‌ర‌కు అనువైన వేదిక‌ల‌ను గుర్తించేందుకు ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది.

జి20 అధ్య‌క్ష ప‌ద‌విని రెండు సార్లు మార్చుకున్న త‌ర్వాత భార‌త‌దేశం 2021లో ఇట‌లీతో, త‌ర్వాత 2022లో ఇండోనేషియాతో అధికారం చేప‌ట్ట‌నుంది.

దేశాధినేత‌ల , ప్ర‌భుత్వాధినేత‌ల స్థాయిలో జి20 లీడ‌ర్స్ స‌మ్మిట్ 09 , 10 సెప్టెంబ‌ర్ 2023లో న్యూఢిల్లీలో జ‌ర‌గ‌నుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది.

న‌వంబ‌ర్ 15-16 మ‌ధ్య బాలిలో జ‌ర‌గ‌నున్న జి20 స‌మ్మిట్ కు(G20 Summit Delhi) ఇండోనేషియా, ర‌ష్యా, ఉక్రెయిన్ అధ్య‌క్షుల‌ను ఆహ్వానించింది. ఈ ఏడాది స‌న్నాహ‌క స‌మావేశాల‌లో ర‌ష్యా ఉనికి ఇప్ప‌టికే ఇత‌ర స‌భ్య దేశాల‌తో కొంత ఉద్రిక్త‌త‌కు దారితీసింది.

Also Read : త‌మిళ స‌మ‌స్య‌పై భార‌త్ ఆందోళ‌న

Leave A Reply

Your Email Id will not be published!