Bandi Sanjay : కేటీఆర్ డ్ర‌గ్స్ టెస్ట్ కు సిద్ద‌మా – బండి

స‌వాల్ విసిరిన బీజేపీ స్టేట్ చీఫ్

Bandi Sanjay : తెలంగాణ‌లో మాట‌ల యుద్దం తారా స్థాయికి చేరింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ , టీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య నువ్వా నేనా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఒక‌రిపై మ‌రొక‌రు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసుకుంటూ మ‌రింత రాజ‌కీయ వేడి రాజేస్తున్నారు. తాజాగా కేసీఆర్ ఫ్యామిలీపై నిప్పులు చెరిగారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్(Bandi Sanjay).

ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా ఉండాల్సిన మంత్రి కేటీఆర్ డ‌గ్స్ కు బానిస అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇక కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేద‌న్నారు. ఇక్క‌డ మ‌ద్యం వ్యాపారం చాల‌ద‌ని ఢిల్లీలో లిక్క‌ర్ స్కాంకు తెర లేపింద‌ని మండిప‌డ్డారు. ఎవ‌రిని ఉద్ద‌రించేందుకు ఇలా చేశారంటూ ప్ర‌శ్నించారు.

తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మి ఓటు వేస్తే ఇలా చేస్తారా అంటూ నిల‌దీశారు. ఏపీ రాష్ట్రం విడిపోయిన‌ప్పుడు మిగులు బ‌డ్జెట్ తో ఉండేద‌ని కానీ టీఆర్ఎస్ కొలువు తీరాక రూ. 4 ల‌క్ష‌ల కోట్ల అప్పు మిగిలింద‌ని మండిప‌డ్డారు. మ‌రోసారి కేటీఆర్ ను టార్గెట్ చేశారు బండి సంజ‌య్(Bandi Sanjay). ఆయ‌న బ్ల‌డ్ శాంపిల్స్ (న‌మూనా) ఇస్తే తాను నిరూపిస్తాన‌ని అన్నారు .

ఇచ్చే ద‌మ్ము కేటీఆర్ కు ఉందా అని స‌వాల్ విసిరారు. నిర్మ‌ల్ జిల్లా దిమ్మ‌దుర్తిలో మంగ‌ళ‌వారం అంబేద్క‌ర్ వ‌ర్దంతి సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జీ20 స‌మావేశానికి ప్ర‌ధాన‌మంత్రి పిలిస్తే సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్ల‌లేద‌ని ప్ర‌శ్నించారు.

పూర్తిగా ప్ర‌జ‌లను అవ‌మానించ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. అవినీతిలో తండ్రికి త‌గిన కూతురుగా క‌విత గుర్తింపు పొందింద‌ని ఎద్దేవా చేశారు.

Also Read : విజ‌యం ఖాయం మాదే రాజ్యం – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!