Jupally Krishna Rao : జూపల్లి షాకింగ్ కామెంట్స్
కొత్తగూడెం వేదికగా ప్రకటిస్తా
Jupally Krishna Rao : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నారు. ఆనాడు రైతుల కోసం జైలుకు కూడా వెళ్లారు. పలు పోరాటాలలో పాల్గొన్నారు. బేషరతుగా తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలలో కాంగ్రెస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. కొల్లాపూర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జూపల్లి కృష్ణా రావుకు మంచి పట్టుంది. ప్రజల మధ్య ఉంటారనే పేరు కూడా తెచ్చుకున్న ఆయనను సీఎం కేసీఆర్ పక్కన పెట్టడాన్ని సహించలేక పోయారు.
ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టే జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) గత కొంత కాలం నుంచీ బీఆర్ఎస్ లో నిరసన గళం వినిపిస్తున్నారు. స్వయంగా కేటీఆర్ ఆయన ఇంటికి కూడా వెళ్లారు. కానీ ఏమైందో ఏమో కానీ ఆదివారం సంచలన కామెంట్స్ చేశారు జూపల్లి కృష్ణారావు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర సర్కార్ పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ లో ఉన్నట్లు తాను ఏనాడూ చెప్పలేదన్నారు. తాను ఉన్నానో లేదో చెప్పాల్సింది తాను కాదని పార్టీ హైకమాండ్ చెప్పాలన్నారు. తన నిర్ణయాన్ని కొత్తగూడెంలో ప్రకటిస్తానని స్పష్టం చేశారు. పొంగులేటి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు బయలు దేరి వెళ్లారు జూపల్లి.
Also Read : సోము..నల్లారి బిజీ బిజీ