Kakani Govardhan Reddy : రామోజీ డైరెక్ష‌న్ బాబు యాక్ష‌న్

మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి కామెంట్స్

Kakani Govardhan Reddy : అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర వ్య‌వ‌సాయం శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రామోజీ రావు డైరెక్ష‌న్ చేస్తే చంద్ర‌బాబు నాయుడు యాక్ష‌న్ చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తుపాను ప‌రిహారంపై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. వ్య‌వ‌సాయంపై బాబు బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ద‌మేనా అని స‌వాల్ విసిరారు.

Kakani Govardhan Reddy Comment

రైతుల‌కు ఎన్నో ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందించ‌డం జ‌రిగింద‌న్నారు. కానీ వాటిని గుర్తించ‌కుండా నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. జైలుకు వెళ్లి వ‌చ్చినా ఇంకా బాబు బుద్ది మార‌లేద‌న్నారు. బుర‌ద రాజ‌కీయాలు చేస్తూ ఫోటోల‌కు ఫోజులు ఇవ్వ‌డం మానుకోవాల‌న్నారు.

కందిపప్పుకి, పెసర పప్పుకి తేడా తెలియని లోకేశ్ కూడా విమర్శలు చేయడమా అని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి(Kakani Govardhan Reddy) ప్ర‌శ్నించారు. గ‌తంలో వ్య‌వ‌సాయం దండగ అన్న మ‌హానుభావుడు చంద్ర‌బాబు నాయుడు అంటూ మండిప‌డ్డారు.

తుఫాను విష‌యంలో స‌ర్కార్ ఎక్క‌డ త‌ప్పు చేసిందో ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేక పోయార‌ని , కేవ‌లం ప్ర‌చారం కోసం త‌ప్ప ఆదుకునే బాప‌తు బాబుది కాద‌న్నారు కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్ర‌బాబు నాయుడు రైతుల‌కు ఏం చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Also Read : Eatala Rajender : మ‌ళ్లీ మోదీనే దేశానికి పీఎం

Leave A Reply

Your Email Id will not be published!