Karthik Subbaraju : ‘శంక‌ర్..చెర్రీ’ మూవీ క‌థ నాదే

కార్తీక్ సుబ్బ‌రాజు కీల‌క కామెంట్స్

Karthik Subbaraju : త‌మిళ సినీ రంగానికి చెందిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. పాపుల‌ర్ డైరెక్ట‌ర్ శంక‌ర్ భారీ బ‌డ్జెట్ తో రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వానీ జంట‌గా తీస్తున్న ఆర్సీ -15 మూవీ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

ఆ మూవీకి సంబంధించిన క‌థ త‌న‌దేనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టాడు. ఇది పూర్తిగా పొలిటిక‌ల్ నేప‌థ్యంగా ఉంటుంద‌ని ఒకానొక సంద‌ర్భంలో తాను శంక‌ర్ కు ఇచ్చాన‌ని స్క్రీన్ ప్లే, డైలాగులు మాత్రం తాను రాసుకుంటున్నాడంటూ పేర్కొన్నాడు.

ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఖ‌ర్చు చేస్తున్నారు. డైరెక్ట‌ర్, చెర్రీతో క‌లిసి చేస్తున్న ఈ మూవీకి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక మూవీకి సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభ‌మైంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై, పుణెల‌లో రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజా అంచ‌నా ప్ర‌కారం రూ. 200 కోట్ల‌కు పైగా తెర‌కెక్కుతోంది.

ఇక ఈ నెల‌లో సినిమాకు సంబంధించి మూడో షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. ఈ త‌రుణంలో కార్తీక్ సుబ్బ‌రాజు (Karthik Subbaraju)శంక‌ర్ పై క‌థ త‌న‌దేనంటూ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఇప్ప‌టికే కార్తీక్ సుబ్బ‌రాజు తీసే సినిమాలు డిఫ‌రెంట్ గా ఉంటాయి. అత‌డి మూవీ మేకింగ్ డిఫ‌రెంట్ గా ఉంటుంది. ఆయ‌న త‌మిళంలో తీసిన పిజ్జా, జిగ‌ర్తాండా, పేట‌, జ‌గ‌మే తాండ్రం లాంటి హిట్ మూవీస్ తీశాడు.

ఇదిలా ఉండ‌గా చ‌ర్చ‌ల్లో భాగంగా శంక‌ర్ కు నాతో పొలిటిక‌ల్ స్టోరీ ఉంద‌న్నా. నాకు ఇవ్వ‌వా అని అడిగాడు. తాను ఓకే చెప్పాన‌ని అన్నాడు కార్తీక్ సుబ్బ‌రాజు. క‌థ నాదైతే మిగ‌తాదంతా ఆయ‌న‌దేన‌ని పేర్కొన్నాడు.

Also Read : కిక్కు ఎక్కిస్తున్న ‘ఖిలాడీ కిస్’

Leave A Reply

Your Email Id will not be published!