Kashmiri Pandit Killed : కాశ్మీరీ పండిట్ రాహుల్ భ‌ట్ కాల్చివేత‌

పొట్ట‌న పెట్టుకున్న ఉగ్ర‌మూక‌లు

Kashmiri Pandit Killed : జ‌మ్మూ కాశ్మీర్ లో ఉగ్ర‌వాదులు దారుణానికి ఒడిగ‌ట్టారు. కాశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో కాశ్మీరీ పండిట్ ను కాల్చి చంపారు. చాదూరా గ్రామంలోని త‌హ‌సిల్దార్ కార్యాల‌యం వ‌ద్ద ఉన్న రాహుల్ భ‌ట్ అనే కాశ్మీరీ పండిట్(Kashmiri Pandit Killed)  పై విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు.

తీవ్రంగా గాయ‌ప‌డిన అత‌డిని స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. భ‌ట్(Kashmiri Pandit Killed)  చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్ద‌రు టెర్ర‌రిస్టులు ప్ర‌భుత్వ ఆఫీసు లోకి చొర‌బ‌డ్డారు. అక్క‌డ ఉన్న ప‌ని చేస్తున్న రాహుల్ భ‌ట్ ను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు.

ఈ విష‌యాన్ని పోలీసులు ధ్రువీక‌రించ‌రాఉ. త‌హ‌సిల్దార్ ఆఫీసు చ‌దూరా, బుద్గాంలో మైనార్టీ క‌మ్యూనిటీకి చెందిన రాహుల్ భ‌ట్ ఉగ్ర‌వాదులు దాడికి పాల్ప‌డ్డారని కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్ల‌డించారు.

ఈ విష‌యాన్ని ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. గ‌త ఎనిమిది నెల‌లుగా కాశ్మీర్ ను చుట్టుముట్టిన వ‌ల‌స కార్మికులు, స్థానిక మైనార్టీల‌ను టార్గెట్ చేసుకున్న టెర్ర‌రిస్టులు దాడుల‌కు పాల్ప‌డుతూ వ‌స్తున్నారు.

దీనినే వారు కొంత కాలం నుంచి లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారు. ఇక్క‌డ బ‌తుకు దెరువు కోసం, జాబ్స్ కోసం వ‌ల‌స వ‌చ్చిన వారిని చంప‌డమే ఉగ్ర‌వాదులు ప‌నిగా పెట్టుకున్నార‌ని తెలిపారు పోలీసులు.

ఇక్క‌డికి వ‌చ్చిన వారంతా వల‌స దారులు, స్వ‌దేశీ కశ్మీరీ పండిట్ లు ఉన్నారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ లో ఐదు రోజుల్లో ఏకంగా ఏడుగురు పౌరుల్ని పొట్ట‌న పెట్టుకున్నారు. వారిలో ఒక‌రు కాశ్మీర్ పండిట్(Kashmiri Pandit Killed) , ఒక‌రు సిక్కు, ఇద్ద‌రు స్థానికేత‌ర హిందువులు ఉన్నారు.

జ‌మ్మూ కాశ్మీర్లో క‌నీసం 168 మంది ఉగ్ర‌వాదులు ప‌ని చేస్తున్నార‌ని, వీరిలో 75 మందిని చంపేశామ‌ని చెప్పారు. కాల్పుల ఘ‌ట‌న‌పై హోం శాఖ మంత్రి షా ఆరా తీశారు.

 

Also Read : కిర‌ణ్ రిజిజు రాజ్యాంగం చ‌దువుకో

Leave A Reply

Your Email Id will not be published!