Anurag Thakur : లిక్క‌ర్ స్కాంలో కేజ్రీవాల్ కీల‌కం – ఠాకూర్

కేంద్ర మంత్రి సంచ‌ల‌న కామెంట్స్

Anurag Thakur :  మ‌ద్యం పాల‌సీకి సంబంధించిన స్కాంలో డిప్యూటీ సీఎం సిసోడియా కంటే ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కీలక‌మైన వ్య‌క్తి అని, ఒక ర‌కంగా మొత్తం అత‌డి చుట్టే తిరిగిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur).

మ‌ద్యం కుంభ‌కోణంలో నెంబ‌ర్ వ‌న్ నిందితుడు సిసోడియా అయితే కేజ్రీవాల్ కింగ్ పిన్ అంటూ ఎద్దేవా చేశారు. స్కాంలో సీబీఐ ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేయ‌డంతో కేజ్రీవాల్ త‌ట్టుకోలేక పోతున్నార‌ని అన్నారు.

ఆయ‌న ముఖ క‌వ‌లిక‌లు పూర్తిగా మారి పోయాయ‌ని చెప్పారు. ఆయ‌న ఏ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం స‌రిగా చెప్ప‌లేక పోయ‌డంటూ మండిప‌డ్డారు అనురాగ్ ఠాకూర్.

ప్ర‌భుత్వానికి సంబంధించిన ఏ పాల‌సీ అయినా సీఎంకు తెలియ‌కుండా జ‌ర‌గ‌ద‌న్నారు. సిసోడియో నామామాత్ర‌మేన‌ని కానీ క‌థ న‌డిపించిందంతా అర‌వింద్ కేజ్రీవాల్ నంటూ ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా దేశంలో బీజేపీకి ఆప్ ప్ర‌త్యామ్నాయంగా ఎదగ‌డాన్ని జీర్ణించు కోలేక పోతున్నారంటూ సిసోడియా ఆరోపించారు. రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీ వ‌ర్సెస్ ఆప్ ఉండ‌బోతోంద‌న్నారు.

ప‌దే ప‌దే కేజ్రీవాల్ ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని చేసిన ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా కొట్టి పారేశారు కేంద్ర మంత్రి. ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలేనంటూ ఫైర్ అయ్యారు.

విద్య‌, ఆరోగ్యం పేరుతో పూర్తిగా రాష్ట్రాన్ని , ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారంటూ సీరియ‌స్ అయ్యారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కుల‌ను భ‌య‌పెట్టేందుకు అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారంటూ సిసోడియా చెప్ప‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు.

ప్ర‌స్తుతం ఢిల్లీలో ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ వ‌ర్సెస్ ఆప్

Leave A Reply

Your Email Id will not be published!