Kicchennagari Laxma Reddy : స‌బిత‌మ్మ ఓట‌మి ఖాయం

కాంగ్రెస్ అభ్య‌ర్థి కామెంట్

Kicchennagari Laxma Reddy : హైద‌రాబాద్ – రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న స‌బితా ఇంద్రారెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కాంగ్రెస్(Congress) పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న కిచ్చెన్న‌గారి ల‌క్ష్మారెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమె చేసింది ఏమీ లేద‌న్నారు. ప్ర‌జ‌లు తుక్కు తుక్కుగా ఓడించేందుకు , త‌గిన రీతిలో బుద్ది చెప్పేందుకు సిద్ద‌గా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు.

Kicchennagari Laxma Reddy Comments on Sabitha Indra Reddy

బీఆర్ఎస్ వ‌ల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు , వారి అనుచ‌రులు మాత్ర‌మే బాగు ప‌డ్డార‌ని సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, పేద‌లకు తీవ్ర స్థాయిలో అన్యాయం జ‌రిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేఎల్ఆర్. త‌న‌పై ప్ర‌జ‌లు న‌మ్మ‌కం పెట్టుకున్నార‌ని స‌బితా ఇంద్రా రెడ్డికి ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌న్నారు. ఆమె ఇక ఇంట్లో కూర్చోవాల్సిందేన‌ని ఎద్దేవా చేశారు.

ప్ర‌స్తుతం పోటీ జ‌రుగుతోంది దొర‌ల తెలంగాణ‌కు ప్ర‌జ‌ల తెలంగాణ‌కు మ‌ధ్య అని పేర్కొన్నారు. తాను ఎలాంటి ప‌ద‌విని ఆశించ‌కుండా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ సేవ‌లు అందించాన‌ని చెప్పారు. అందుకే తాను వంద శాతం గెలుస్తాన‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు కిచ్చెన్న‌గారి ల‌క్ష్మా రెడ్డి.

త‌న‌ను టార్గెట్ చేస్తూ ఐటీ పేరుతో దాడులు చేయించార‌ని, అయినా తాము భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. కేసీఆర్, కేటీఆర్, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని జ‌నం న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. వారిని త‌న్ని త‌రిమే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు.

Also Read : Pocharam Srinivas Reddy : గెలుస్తా మ‌ళ్లీ వ‌స్తా – పోచారం

Leave A Reply

Your Email Id will not be published!