Kirit Somaiya : రౌత్ పై రూ. 100 కోట్ల ప‌రువు న‌ష్టం దావా

మేధా కిరీట్ సోమ‌య్య‌, ఆమె భ‌ర్త దాఖ‌లు

Kirit Somaiya : శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ, సామ్నా గౌర‌వ ఎడిట‌ర్ సంజ‌య్ రౌత్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న‌పై రూ. 100 కోట్ల ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లైంది.

భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన మేధా కిరీట్ సోమ‌య్య‌(Kirit Somaiya), ఆమె భ‌ర్త ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇదిలా ఉండగా వీరిద్ద‌రూ భారీ ఎత్తున కుంభ‌కోణానికి పాల్ప‌డ్డారంటూ సంజయ్ రౌత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చారు.

త‌న వ‌ద్ద ఆధారాలు కూడా ఉన్నాయ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. కావాల‌ని త‌మ ప‌రువుకు భంగం క‌లిగించేలా సంజ‌య్ రౌత్ కామెంట్స్ చేస్తూ వ‌చ్చార‌ని, వాటిని భ‌రిస్తూ వ‌చ్చామ‌ని, కానీ ఇప్పుడు భ‌రించే స్థితిలో లేమ‌న్నారు.

తాము ఎక్క‌డ కుంభ కోణాల‌కు పాల్ప‌డ్డామో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని భార్య‌, భ‌ర్త‌లు ఇద్ద‌రూ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు త‌మ‌పై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తూ త‌మ‌ను కావాల‌నే బ‌ద్నాం చేస్తూ వ‌స్తున్న సంజ‌య్ రౌత్ పై బొంబాయి హైకోర్టులో రూ. 100 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం చెల్లించాలంటూ దావా వేశామ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా మ‌హారాష్ట్ర లోని మీరా – భ‌యంద‌ర్ మున్సిపల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని ప్రాంతంలో టాయిలెట్ల నిర్మాణంలో మ‌స్త్రధా కిరీట్ సోమ‌య్య‌, ఆమె భ‌ర్త భారీ ఎత్తున అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు.

కాగా త‌మ‌కు ప‌రువు న‌ష్టం డ‌బ్బులు అక్క‌ర్లేద‌ని, వాటిని సామాజిక సేవ‌కు వినియోగించాల‌ని బీజేపీ నేత కిరీట్ సోమ‌య్య(Kirit Somaiya) చెప్పారు.

ఇప్పుడు సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే, సంజ‌య్ రౌత్ స‌మాధానం చెప్పాల్సి ఉంటుంద‌న్నారు. మీడియాలో త‌మ‌పై అన‌వ‌స‌రంగా బుర‌ద చల్లారంటూ ఆరోపించారు.

Also Read : రైతన్న‌ల ఆందోళ‌న‌కు మ‌ద్ధ‌తిచ్చాం

Leave A Reply

Your Email Id will not be published!