Kodali Nani Vangaveeti Radha : కొడాలి నాని రాధా ములాఖ‌త్

పార్టీలు వేరైనా స్నేహం ఒక్క‌టే

Kodali Nani Vangaveeti Radha : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. చాలా రోజుల త‌ర్వాత మాజీ మంత్రి కొడాలి నాని వంగ వీటి రాధా(Kodali Nani Vangaveeti Radha) క‌లుసుకున్నారు ఇద్దరూ మంచి స్నేహితులే. గ‌తంలో కూడా ప‌లుమార్లు క‌లుసుకున్నారు.

గుడివాడ‌లో వైఎస్సార్సీపీ నాయ‌కుడి కూతురు పెళ్లికి ఈ ఇద్ద‌రు అగ్ర నాయ‌కులు హాజ‌ర‌య్యారు. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. కానీ ఈసారి వంగ‌వీటి రాధ రాక కోసం కొడాలి నాని అరగంట‌కు పైగా వేచి ఉన్నారు. అక్క‌డున్న నేత‌ల‌ను, శ్రేణుల‌ను, అభిమానుల‌ను విస్తు పోయేలా చేసింది.

వంగ‌వీటి రాధా రాగానే త‌న కారు వ‌ద్దకు వెళ్లి నానిని రిసీవ్ చేసుకున్నారు కొడాలి నాని. ఇద్ద‌రూ స‌ర‌దాగా మాట్లాడుకున్నారు. ప్ర‌స్తుతం ఈ సీన్ ఆస‌క్తిక‌రంగా మారింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు మాజీ మంత్రి కొడాలి నాని, వంగ‌వీటి రాధా. అనంత‌రం చాలా సేపు ఇద్ద‌రూ మాట్లాడుకున్నారు.

గ‌తంలో కూడా ఇద్ద‌రూ ఫంక్ష‌న్ల‌లో ఒక‌రినొక‌రు ప‌ల‌రించుకున్నారు. వైసీపీలో ఉన్న కొడాలి నాని , తెలుగుదేశం పార్టీలో కొన‌సాగుతున్న వంగ‌వీటి రాధా భేటీ కావ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వంగ వీటి రాధా టీడీపీలో చేర‌క ముందు వైఎస్సార్ సీపీ లో ఉన్నారు.

కొన్ని ప‌రిణామాలు చోటు చేసుకున్న నేప‌థ్యంలో రాధా తెలుగుదేశం పార్టీలో చేరారు. గ‌తంలో రాధా, నాని మ‌ధ్య దూరం పెరిగింద‌ని ప్ర‌చారం జోరందుకుంది. రాజ‌కీయాలు వేరు..స్నేహం వేరు అని నిరూపించారు.

Also Read : తెలంగాణ‌ను ఏపీలో క‌ల‌పండి

Leave A Reply

Your Email Id will not be published!