Krishna Vamsi : ప్ర‌కాశ్ రాజ్ ప‌ని రాక్ష‌సుడు

డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ కితాబు

Krishna Vamsi : తెలుగు సినిమా రంగంలో ఆయ‌న వెరీ స్పెష‌ల్. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిగా పేరొందిన కృష్ణ‌వంశీ (Krishna Vamsi)ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌కాశ్ రాజ్ అద్భుత‌మైన న‌టుడే కాద‌ని అంత‌కంటే న‌ట‌న ప‌ట్ల గొప్ప నిబ‌ద్ద‌త ఉన్న వ్య‌క్తి అంటూ కితాబు ఇచ్చాడు.

ప‌నిలో ప‌నిగా ప్రకాశ్ రాజ్ ను ప‌ని రాక్ష‌సుడంటూ పేర్కొన్నారు. చాలా వ‌ర‌కు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో కృష్ణ వంశీ (Krishna Vamsi) అంటేనే వ‌ర్క్ కు ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తార‌న్న పేరుంది.

ఈ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడి మ‌న‌సులోంచి వ‌చ్చిన ఈ కామెంట్స్ ప్ర‌కాశ్ రాజ్ కు బూస్ట్ అప్ లా ప‌ని చేస్తాయ‌న‌డంలో సందేహం లేదు. ఇదిలా ఉండ‌గా ప్ర‌కాశ్ రాజ్ తో చేసిన సినిమాల్లో ఖ‌డ్గం ఒక‌టి.

ఆ త‌ర్వాత చాలా గ్యాప్ త‌ర్వాత చేస్తున్న సినిమా రంగ‌మార్తాండ‌. న‌ట సామ్రాట్ అనే మ‌రాఠీ మూవీకి ఇది పూర్తిగా రీమేక్. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకుంది.

క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డి చివ‌ర‌కు పూర్త‌య్యే ద‌శ‌లో ఉంది ఈ మూవీ. తాజాగా తిరిగి సెట్స్ పైకి వ‌చ్చింది. సినిమాకు సంబంధించిన భావోద్వేగ స‌న్నివేశాలను చిత్రీక‌రిస్తున్న‌ట్లు డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ స్వ‌యంగా వెల్ల‌డించారు.

ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. తాను తీస్తున్న రంగ మార్తండ ఫైన‌ల్ స్టేజ్ కు వ‌చ్చింద‌న్నాడు. అంతే కాదు తాను ప్ర‌త్యేకించి అభిమానించే అరుదైన న‌టుడు..ప‌ని రాక్ష‌సుడు ప్ర‌కాశ్ రాజ్ అంటూ ప్రేమ‌గా రాసుకు వ‌చ్చాడు.

Also Read : బాల‌య్య బాబు అరుదైన రికార్డు

Leave A Reply

Your Email Id will not be published!