Kumar Vishwas : మోసం..న‌మ్మ‌క ద్రోహం కేజ్రీవాల్ నైజం

మాజీ ఆప్ నేత‌..క‌వి కుమార్ విశ్వాస్

Kumar Vishwas : ఆప్ బ‌హిష్కృత నేత‌, ప్ర‌ముఖ క‌వి కుమార్ విశ్వాస్(Kumar Vishwas)  షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న గ‌త కొంత కాలం నుంచి ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ను ఏకి పారేస్తున్నారు. తాజాగా మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కుమార్ విశ్వాస్. ఈ దేశంలో అత్యంత మోస పూరిత‌మైన వ్య‌క్తి ఎవ‌రైనా ఉన్నారంటే అది కేజ్రీవాల్ అని పేర్కొన్నారు.

మోసానికి , న‌మ్మ‌క ద్రోహ‌నికి కేరాఫ్ ఆయ‌న జీవితం అని ఎద్దేవా చేశారు. అఖిలేష్ యాద‌వ్ , మ‌మ‌తా బెన‌ర్జీ, నితీశ్ కుమార్ లు స‌గం మైనార్టీ ఓట్ల‌కు పోటీదారుల‌ని అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కు తెలుస‌న్నారు. ప్ర‌స్తుతం అర‌వింద్ కేజ్రీవాల్ భార‌తీయ క‌రెన్సీ కి సంబంధించిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

దీనిని తీవ్రంగా ఖండించింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఇంత‌కూ ఆప్ చీఫ్ ఏమ‌న్నారంటే క‌రెన్సీ నోట్ల‌పై మ‌హాత్మా గాంధీతో పాటు ల‌క్ష్మి, వినాయ‌కుడి చిత్రాల‌ను కూడా ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అంతే కాదు త్వ‌ర‌లోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి(PM Modi) లేఖ రాస్తాన‌ని తెలిపారు.

దీనిపై సీరియ‌స్ గా స్పందించింది బీజేపీ, ఆపార్టీ సీనియ‌ర్ నేత సంబిత్ పాత్ర అయితే ఇది పూర్తిగా కేజ్రీవాల్ ఆడుతున్న మైండ్ గేమ్ లో ఒక భాగ‌మ‌న్నారు. ఎన్నిక‌ల స్టంట్ గా కొట్టి పారేశారు పాత్ర‌. ల‌క్ష్మీ, గ‌ణేశుడి చిత్రాల‌ను ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌తిపాద‌న అంతా బ‌క్వాస్ అని కొట్టి పారేశారు కుమార్ విశ్వాస్.

82 శాతం ఓటు బ్యాంకు ఉన్న హిందూ ఓటు బ్యాంకులో క‌నీసం స‌గ‌మైనా కొట్టేయాల‌నే ఆలోచ‌న‌తో అర‌వింద్ కేజ్రీవాల్ ఇలా చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : అదంతా కేజ్రీవాల్ ఎన్నిక‌ల స్టంట్

Leave A Reply

Your Email Id will not be published!