Mahua Moitra : ఢిల్లీ ఖాకీలు వెన్నెముక లేనోళ్లు – మ‌హూవా

టీఎంసీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ క‌ల‌క‌లం

Mahua Moitra : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మ‌హూవా మోయిత్రా(Mahua Moitra) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆగ‌స్టు 28న ఆదివారం ఢిల్లీలో జ‌ర‌గాల్సిన స్టాండ్ అప్ క‌మేడియ‌న్ మునావ‌ర్ ఫారూఖీ కామెడీ షోకు అనుమతి ఇచ్చేందుకు నిరాక‌రించారు ఢిల్లీ పోలీసులు.

ఈ సంద‌ర్భంగా ఢిల్లీ పోలీసులు వెన్నెముక లేనోళ్లంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.. విశ్వ హిందూ ప‌రిష‌త్ దీని వెనుక హ‌స్తం ఉందంటూ ఆరోపించారు.

స్వాతంత్రం వ‌చ్చిన 75 ఏళ్ల త‌ర్వాత భార‌త దేశం లో మ‌త సామ‌ర‌స్యం పెళుసుగా ఉందా అది కామెడీ షోతో విఘాతం క‌లిగిస్తుందా అంటూ ఎంపీ ప్ర‌శ్నించారు.

మునావ‌ర్ ఫారూఖీ చేస్తున్న‌ది ఏంటి. ఆయ‌న స‌మాజంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తున్నారు. ప్ర‌ధానంగా బీజేపీ స‌ర్కార్ చేస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఒక క‌ళాకారుడికి ఆ మాత్రం స్వేచ్ఛ లేక పోవ‌డం ఏంటి అంటూ నిల‌దీశారు మ‌హూవా మోయిత్రా. ఈ సంద‌ర్భంగా జాతిపిత మ‌హాత్మా గాంధీ పేర్కొన్న సందేశాన్ని గుర్తు చేశారు.

నా ఇంటికి అన్ని వైపులా గోడ‌లు నిర్మించ‌డం, కిటికీల‌తో నింప‌డం నాకు ఇష్టం లేద‌న్న కోట్ ను ఉద‌హ‌రించారు టీఎంసీ ఎంపీ. కాగా మునావ‌ర్ ఫారూఖీ షో పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది వీహెచ్ పీ.

మ‌త సామ‌ర‌స్యానికి భంగం క‌లుగుతుందంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో షోకు ప‌ర్మిష‌న్ లేదంటూ పేర్కొన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించింది మ‌హూవా మోయిత్రా. ప్ర‌స్తుతం ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : హైక‌మాండ్ పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చింది – బొమ్మై

Leave A Reply

Your Email Id will not be published!