Mahua Moitra : మోదీదే మ‌ణిపూర్ బాధ్య‌త – మ‌హూవా

టీఎంసీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

Mahua Moitra : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మ‌హూవా మొయిత్రా తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై. మ‌ణిపూర్ లో ఏం జ‌రుగుతుందో ఇప్ప‌టికైనా తెలుసుకున్నారా అని ప్ర‌శ్నించారు. కేవ‌లం ప్ర‌శ్న‌లు మాత్ర‌మే మిగిలి పోతున్నాయ‌ని కానీ త‌మ‌కు జ‌వాబు మాత్రం రావ‌డం లేదంటూ మండిప‌డ్డారు. మోదీ ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విని స్వంత జాగీర‌ని భావిస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Mahua Moitra Comments on Modi About Manipur

ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేది. పూర్తిగా అత్యంత బాధ్య‌తా రాహిత్యంతో మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు ఎంపీ మ‌హూవా మొయిత్రా(Mahua Moitra). తాము క్ష‌మించినా దేశ ప్ర‌జ‌లు మోదీని ఎట్టి ప‌రిస్థితుల్లో ఒప్పుకోర‌న్నారు. ప్ర‌తి పార్టీకి, వ్య‌క్తికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. కొంత కాలం త‌ర్వాత మోదీ అడ్ర‌స్ లేకుండా పోతారంటూ జోష్యం చెప్పారు టీఎంసీ ఎంపీ.

ఈ దేశంలో మోదీ లేక పోతే ఎవ‌రు నిల‌బ‌డ‌తార‌ని, మోదీ ఉన్నా లేక పోయినా దేశం అలాగే ఉంటుందన్న సంగ‌తి బీజేపీ, కాషాయ శ్రేణులు, దాని అనుబంధ సంస్థ‌లు చేసే దారుణాల‌కు ముగింపు ప‌లికే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌న్నారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని అది జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌న్నారు మ‌హూమా మొయిత్రా.

Also Read : CM KCR : క‌ల సాకారం చారిత్రిక విజ‌యం – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!