Tiger Mallareddy KCR : మల్లారెడ్డి టైగర్ నిరంజన్ రెడ్డి ఫైటర్
కార్మిక శాఖ మంత్రికి సీఎం కితాబు
Tiger Mallareddy KCR : ఓ వైపు లెక్కల కొద్ది నోట్లు..మరో వైపు 5 కేజీలకు పైగా బంగారం..చెప్పలేనన్ని ఆస్తులు..ఆపై కాలేజీలు, స్కూళ్లు..దవఖానాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోపణలు మరెన్నో విమర్శలు. కేంద్ర దర్యాప్తు సంస్థలు జల్లెడ పట్టాయి. ఇటీవల హైదరాబాద్ లో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Tiger Mallareddy) ఇంటితో పాటు కొడుకులు, కూతుళ్లు, కోడళ్లు, కుటుంబీకులు, సన్నిహితులు ఇలా ప్రతి చోటా దాడులు చేశారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200 మంది ఐటీ శాఖ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. రూ. 18 కోట్లకు పైగా నగదు దొరికినట్లు సమాచారం. ఇదంతా పక్కన పెడితే వీటన్నిటికి సంబంధించి లావాదేవీలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని మనీ లాండరింగ్ జరిగిందని ఐటీ శాఖ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి రాసింది.
దీంతో ఢిల్లీకి కబురు పంపారు. మరో వైపు రాష్ట్రంలో లిక్కర్ స్కాం అతలాకుతలం చేస్తోంది. స్వంతంగా సీఎం కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఉండడం, ఆమెకు కూడా నోటీసులు జారీ చేయడం విస్తు పోయేలా చేసింది. కానీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారం మరో వైపు హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉండగా మహబూబ్ నగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో భారీ ఎత్తున జనాన్ని చూసిన సీఎం ఉప్పొంగి పోయారు. ఆ వెంటనే మంత్రులు మల్లారెడ్డిని ఉద్దేశించి టైగర్ మల్లారెడ్డి(Tiger Mallareddy) అని సంబోధించారు. ఆపై అక్కడే ఆసీనులైన మంత్రి నిరంజన్ రెడ్డిని నీళ్ల నిరంజన్ రెడ్డి అంటూ కితాబు ఇచ్చారు.
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ ఇద్దరు. ప్రధానంగా నిరంజన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల. తనను మరదలు అని అన్నందుకు ఆమె చెప్పుతో కొడతానని అనడం ఉద్రిక్తతకు దారి తీసింది.
Also Read : అవినీతిలో అదుర్స్ పాలనలో బేవార్స్ – బండి