Mamata Banerjee : మోదీ స‌ర్కార్ ను ప్ర‌జ‌లే కూలుస్తారు – దీదీ

సంచ‌ల‌న కామెంట్ చేసిన బెంగాల్ సీఎం

Mamata Banerjee : టీఎంసీ చీఫ్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రానున్న రోజుల్లో మోదీ కాషాయ స‌ర్కార్ ను ప్ర‌జ‌లే కూల్చ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. సోమ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు.

కేంద్రంలోని మోదీ త్ర‌యం ( మోదీ, అమిత్ షా , జేపీ న‌డ్డా ) కావాల‌ని బీజేపీయేత‌ర రాష్ట్రాల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తూ వ‌చ్చార‌ని ఆరోపించారు.

ఈ ఎనిమిదేళ్ల కాలంలో ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఎన్నికైన ప్ర‌భుత్వాల‌ను అసంతృప్తుల పేరుతో, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల విచార‌ణ‌ల పేరుతో బెదిరింపుల‌కు గురి చేసి కూల్చేసిన ఘ‌న‌త మోదీ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌ని మండిప‌డ్డారు మ‌మ‌తా బెన‌ర్జీ.

మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన , కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వాన్ని అప్ర‌జాస్వామికంగా కూల్చి వేశారంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగ‌మేనంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అధికారం ఉంది క‌దా అని ఇలా చేసుకుంటూ పోతే ప్ర‌జ‌లు ఏదో ఒక రోజు మోదీకి మంగ‌ళం పాడ‌టం ఖాయ‌మ‌న్నారు. ఒకే దేశం ఒకే భాషొ ఒకే ప్ర‌భుత్వం నినాదంతో ప్ర‌తిప‌క్షాలు లేకుండా చేయాల‌ని అనుకోవ‌డం దారుణ‌మ‌న్నారు.

రోజు రోజుకు ప్ర‌తీకారంతో, అధికార ద‌ర్పంతో అక్ర‌మ ప‌ద్ద‌తుల్లో కూల్చ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు సీఎం. వాళ్లు అక్ర‌మంగా ఇవాళ మ‌హారాష్ట్ర‌లో గెలిచి ఉండ వ‌చ్చు.

లేదా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండ‌వచ్చు కానీ ప్ర‌జ‌ల హృద‌యాల‌లో వాళ్లు దోషులుగా మిగిలి పోవ‌డం ఖాయ‌మ‌న్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తాను ఇంత వ‌ర‌కు చూడ లేద‌న్నారు మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee).

Also Read : ఏ నిర్ణ‌యం తీసుకున్నా ప్ర‌జ‌ల కోస‌మే – స్టాలిన్

Leave A Reply

Your Email Id will not be published!