Minister KTR : కాంగ్రెస్ ను న‌మ్మితే న‌ట్టేట మునిగిన‌ట్టే

ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్

Minister KTR : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల తూటాలు పేల్చుతూ మ‌రింత అగ్గిని రాజేస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నువ్వా నేనా అన్నంత‌గా మారి పోయింది. మొన్న‌టి దాకా బీజేపీ రేసులో ఉండ‌గా దానిని దాటేసింది ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలోని ఈ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ తో సై అంటోంది.

Minister KTR Shocking Comments on Congress

ఈ సంద‌ర్బంగా బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ, పరిశ్ర‌మ‌ల , పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీని ఏకి పారేస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కాంగ్రెస్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఆ పార్టీని న‌మ్ముకుంటే న‌ట్టేట మునిగిన‌ట్టేన‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు. హామీల పేరుతో క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల‌ను మోసం చేశారని, ఇక్క‌డ కూడా ఇదే గ‌తి ప‌డుతుంద‌ని అన్నారు. కుంభ‌కోణాల‌కు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అని ఆరోపించారు.

ప్ర‌జ‌లు ఆచితూచి ఓటును వేయాల‌ని, లేక‌పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటార‌ని హెచ్చ‌రించారు కేటీఆర్. ఇక‌నైనా తెలంగాణ రైత‌న్న‌లు ఏ మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండ‌క పోతే క‌ష్టాలు కొని తెచ్చుకుంటార‌ని పేర్కొన్నారు మంత్రి.

Also Read : Komatireddy Venkat Reddy : కోమ‌టిరెడ్డి చేరిక తెలియ‌దు

Leave A Reply

Your Email Id will not be published!