MLA Raghunandan Rao : దుబ్బాక ఎమ్మెల్యే ధిక్కార స్వరం
జేపీ నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తా
MLA Raghunandan Rao : నిన్నటి దాకా ప్రశాంతంగా ఉన్న భారతీయ జనతా పార్టీలో ఒక్కసారిగా అసంతృప్తి వ్యక్తం కావడం ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. సోమవారం ఢిల్లీ టూర్ లో ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(MLA Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నేరుగా బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. బీజేపీని చూసి ఓట్లు వేయలేదని , తనను, ఈటల రాజేందర్ ను చూసి జనం ఓట్లు వేశారని అన్నారు. 10 ఏళ్ల పాటు తాను పార్టీ కోసం పని చేశానని, తాను పార్టీ తరపున వాయిస్ వినిపించానని చెప్పారు. కులం పేరుతో తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
కనీసం అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకనాడు పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్ కి యాడ్స్ ఇచ్చేందుకు రూ. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ప్రశ్నించారు. నా సేవలకు ప్రతిఫలం దక్కక పోతే నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తను, ఈటల ఫోటోలు ఉంటేనే ఓట్లు పడతాయన్నారు.
దుబ్బాక వల్లనే బీజేపీకి హైప్ వచ్చిందన్నారు. రాజా సింగ్ ను సస్పెండ్ చేశాక ఫ్లోర్ లీడర్ ను ఎంపిక చేయలేదన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారనే ది తెలియక పోవడం దారుణమన్నారు. మొత్తంగా రఘునందన్ రావు లేవదీసిన ప్రశ్నలు కలకలం రేపాయి. ఇప్పుడు ఆయన హాట్ టాపిక్ గా మారారు. మరి బీజేపీ ఎలా మ్యానేజ్ చేస్తుందో వేచి చూడాలి.
Also Read : Akhilesh Yadav : కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ