Shashi Tharoor Modi : మోదీకి ఉన్న బ‌లం అదే – శ‌శి థ‌రూర్

ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తిన ఎంపీ

Shashi Tharoor Modi : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు అస‌మ్మ‌తి నాయ‌కుడిగా పేరొందారు తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్. దేశానికి సంబంధించి ప్ర‌జ‌ల‌ను త‌న వైపు తిప్పుకునేలా చేయ‌డంలో ప్ర‌ధాని స‌క్సెస్ అయ్యారంటూ కితాబు ఇచ్చారు.

శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి సంబంధించి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ప్ర‌జ‌ల భాష‌లో మ‌మేకం కావ‌డం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య అని ప్ర‌శంసించారు శ‌శి థ‌రూర్(Shashi Tharoor).

మోదీకి ఉన్న నైపుణ్యం అద్భుత‌మ‌ని పేర్కొన్నారు. తాను ఎంతో మంది పీఎంల‌ను చూశాన‌ని ఒక్కొక్క‌రిది ఒక్కో నైపుణ్యం ఉంటుంద‌న్నారు. కానీ న‌రేంద్ర మోదీ వెరీ వెరీ స్పెష‌ల్ అని పేర్కొన్నారు శ‌శి థ‌రూర్.

పోటీలో ఉండ‌బోతున్నారు మ‌రి ఎలా ప్లాన్ చేసుకుంటున్నార‌న్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. రాబోయే కాలంలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ పోటీ ఉంటుంద‌న్నారు. ఇందులో ఎలాంటి సందేహం అక్క‌ర్లేద‌న్నారు.

పార్టీల ప‌రంగా వ్య‌క్తిగ‌త ద్వేషం ఉండాల్సిన ప‌ని లేద‌న్నారు. త‌మ పార్టీ ప‌రంగా రాజీవ్ గాంధీ అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాలు క‌లిగి ఉన్నార‌ని పేర్కొన్నారు. ఆయ‌న 21వ శ‌తాబ్దం గురించి క‌ల‌లు క‌న్నార‌ని తాను కూడా ప్ర‌భావితం అయ్యాన‌ని చెప్పారు శ‌శి థ‌రూర్.

దేశంలో హిందీలో అద్బుత‌మైన వ‌క్త‌గా పేరొందిన వారిలో ప్ర‌స్తుతం బీజేపీ మోదీ(PM Modi) గురించి ప‌దే ప‌దే చెబుతోంద‌ని కానీ ఆయ‌న కంటే ఎక్కువ‌గా జ‌నాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కులలో దివంగ‌త ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజపేయ్ కి ఉంద‌న్నారు.

Also Read : నేను అస‌మ్మ‌తి నాయ‌కుడిని కాను – శ‌శి థ‌రూర్

Leave A Reply

Your Email Id will not be published!