Rabri Devi Modi : ఆర్థిక నేర‌గాళ్ల‌కు మోదీ స‌పోర్ట్ – ర‌బ్రీ దేవి

మాజీ సీఎంకు స‌మ‌న్లు జారీపై ఫైర్

Rabri Devi Modi : ఆర్జేడీని, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ను చూసి భార‌తీయ జ‌న‌తా పార్టీ భ‌య‌ప‌డుతోంద‌ని అన్నారు లాలూ భార్య ర‌బ్రీ దేవి(Rabri Devi). ఆర్థిక నేర‌గాళ్లు దేశం విడిచి వెళ్లేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స‌హాయం చేస్తున్నాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అందుకే ఇవాళ గౌత‌మ్ అదానీ వేల కోట్ల సంప‌ద కొల్ల‌గొట్టాడ‌ని , హిండెన్ బ‌ర్గ్ చెప్పే దాకా ఎవ‌రూ వినిపించు కోలేద‌న్నారు. ఇదే స‌మ‌యంలో కోట్లు కొల్ల‌గొట్టిన నీర‌వ్ మోడీ పారిపోయేందుకు ప్ర‌ధాన‌మంత్రి స‌హాయం చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

మంగ‌ళ‌వారం ర‌బ్రీదేవి మీడియాతో మాట్లాడారు. రైల్వే శాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇందుకు సంబంధించి ఉద్యోగాల స్కాంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషించారంటూ ద‌ర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఇందుకు సంబంధించి స‌మ‌న్లు జారీ చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించారు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ భార్య ర‌బ్రీదేవి. బీహార్ లో లాలూను చూసి బీజేపీ జ‌డుసు కుంటోంద‌న్నారు.

అందుకే కేంద్ర ఏజెన్సీలు త‌మ వెంటే ఉన్నాయ‌ని బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ సీనియ‌ర్ నేత ర‌బ్రీదేవి(Rabri Devi Modi) ఆరోపించారు. తాము ఎక్క‌డికీ పారి పోయేది లేద‌న్నారు.

గ‌త 30 సంవ‌త్స‌రాలుగా ఇలాంటి కేసులు ఎదుర్కొంటూనే వ‌స్తున్నామ‌ని అన్నారు. భూ కుంభ కోణంలో లాలూ, ర‌బ్రీ దేవితో పాటు మ‌రో 14 మందికి ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. సీబీఐ దాఖ‌లు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఈ నోటీసులు జారీ చేశారు.

Also Read : మాజీ ఎల్జీపై కేసు పెట్టాల్సిందే – సింగ్

Leave A Reply

Your Email Id will not be published!