Mohammad Azharuddin : పంతం నెగ్గించుకున్న అజాహరుద్దీన్
జూబ్లీ హిల్స్ టికెట్ కేటాయించిన ఏఐసీసీ
Mohammad Azharuddin : హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తన స్థాయి ఏమిటో చెప్పకనే చెప్పారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహమ్మద్ అజాహరుద్దీన్. ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన గతంలో ఎంపీగా గెలుపొందారు. బీజేపీ హోరులో ఓటమి పాలయ్యారు. తనపై బ్యాన్ తీసేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Mohammad Azharuddin Got Chance
ఆ తర్వాత తెలంగాణపై ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గా ఎన్నికయ్యారు. అక్కడ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనపై కేసు కూడా నమోదైంది. ఈ తరుణంలో హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో పోటీ చేయాలని భావించారు. ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆయన రాకను అడ్డుకునే ప్రయత్నం చేశారు దివంగత పీజేఆర్ తనయుడు విష్ణు వర్దన్ రెడ్డి అనుచరులు.
దీనిపై తీవ్రంగా స్పందించారు మహమ్మద్ అజాహరుద్దీన్(Mohammad Azharuddin). తాను జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తానని, టికెట్ తప్పకుండా వస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పార్టీ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తాజాగా ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. తీవ్రంగా కసరత్తు చేసింది. 45 మందితో రెండో జాబితా ప్రకటించింది. ఇందులో విష్ణుకు షాక్ తగిలింది. అజ్జూ భాయ్ కి టికెట్ ఖరారు చేసింది.
Also Read : Tejaswini Pagadala : బాబుకు ఫ్యాన్ కాంగ్రెస్ కు క్యాంపెయిన్