Owaisi : ఎక్కువగా కండోమ్ లు వాడుతున్నది మేమే
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ ఓవైసీ
Owaisi : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Owaisi) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధానంగా ఆయన బీజేపీ, దాని అనుబంధ సంస్థలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా కండోమ్ ల వాడకంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంపీ.
కండోమ్ లను దేశంలో ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తున్నారో తెలుసుకుంటే బావుంటుందన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేపై స్పందించారు ఓవైసీ. ముస్లింల మొత్తం సంతానోత్పత్తి రేటు అత్యధికంగా పడి పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ కు సమాధానం ఇస్తూ ఈ దేశంలో హిందువుల కంటే ఎక్కువగా ముస్లింలే కండోమ్ లు ఉపయోగిస్తున్నారంటూ స్పష్టం చేశారు.
ఇది తెలుసు కోకుండా ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యానించడం మంచి పద్దతి కాదన్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా అక్కడ ముస్లింలు బహిరంగ జైలులో జీవిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. దేశంలో తమ జనాభా పెరడం లేదన్నారు. ఎక్కువగా మేమే కండోమ్ లు ఉపయోగిస్తుంటే ఎలా జనాభా పెరుగుతుందంటూ ప్రశ్నించారు ఓవైసీ.
జనాభా నియంత్రణపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా సమాధానం ఇచ్చారు ఎంపీ. ముస్లింలలో పిల్లల మధ్య అంతరం కూడా పెరుగుతోందన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ దీని గురించి ఆలోచిస్తే బెటర్ అని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో జరిగిన ఓ సభకు సంబంధించిన ఓ వీడియోను ఓవైసీ ట్వీట్ చేశారు. ముస్లింల జనాభా రోజు రోజుకు తగ్గుతోంది. కానీ దీని గురించి మోహన్ భగవత్ మాట్లాడరంటూ ఆరోపించారు.
Also Read : కేంద్రంపై భగ్గుమన్న తేజస్వి యాదవ్
#WATCH | On RSS chief Mohan Bhagwat's statement that there's a religious imbalance in India, AIMIM chief Asaduddin Owaisi says, "Don't fret, Muslim population is not increasing, it's rather falling… Who's using condoms the most? We are. Mohan Bhagwat won't speak on this." pic.twitter.com/kcaYLaNm7A
— ANI (@ANI) October 8, 2022