MP Sanjay Singh : బీజేపీ అడ్డుకున్నా ఆప్ ప్ర‌జా పాల‌న ఆగ‌దు

ఎంపీ సంజ‌య్ సింగ్ షాకింగ్ కామెంట్స్

MP Sanjay Singh : కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌భుత్వాన్ని ప‌దే ప‌దే టార్గెట్ చేస్తోంది.

దాని ఫోక‌స్ అంతా బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌ను నిర్వీర్యం చేయ‌డం లేదా కూల దోయ‌డం. ప్ర‌స్తుతం కంట్లో న‌లుసుగా మారారు కేజ్రీవాల్. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి కంటి మీద నిద్ర ప‌ట్ట‌డం లేదంటూ నిప్పులు చెరిగారు ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్(MP Sanjay Singh).

ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీలో అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయంటూ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ దాడులు చేప‌ట్టింది. మొత్తం 15 మందిని నిందితులుగా పేర్కొంది.

వారిలో మొద‌టి వ్య‌క్తి డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాను పేర్కొన‌డాన్ని తీవ్రంగా త‌ప్పు పట్టారు సంజ‌య్ సింగ్. ఈ సంద‌ర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆప్ రోజు రోజుకు దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తోంది. దానిని త‌ట్టుకోలేక పోతోంది బీజేపీ. ఆ పార్టీకి అంత సీన్ లేద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం ఇవాళ దేశానికి అభివృద్ది విష‌యంలో రోల్ మోడ‌ల్ గా నిలిచింద‌న్నారు.

పొద్ద‌స్త‌మానం కులాలు, మ‌తాలు, ప్రాంతాల పేరుతో చిచ్చు పెట్ట‌డం మాత్ర‌మే తెలిసిన బీజేపీకి అభివృద్ది న‌మూనా గురించి ప‌ట్టద‌న్నారు.

ఆర్థిక నేర‌గాళ్లు, వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట్ ల కు వ‌త్తాసు ప‌లుకుతున్న మోదీకి విద్య‌, వైద్యం, ఉపాధి, మ‌హిళా భ‌ద్ర‌త‌, వ్య‌వ‌సాయం గురించి ఎలా ప‌ట్టించుకుంటార‌ని ప్ర‌శ్నించారు సంజ‌య్ సింగ్(MP Sanjay Singh).

ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా ఆప్ స‌ర్కార్ ప్ర‌జా సంక్షేమం కోసం పాటు ప‌డుతుంద‌న్నారు.

Also Read : సీబీఐ దాడుల‌పై క‌పిల్ సిబ‌ల్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!