Lalu Prasad Yadav : వాళ్ల ముందు త‌ల వంచ లేదు – లాలూ

కేంద్రం, బీజేపీపై మాజీ సీఎం షాకింగ్ కామెంట్స్

Lalu Prasad Yadav ED CBI : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు త‌మ‌పై దాడి చేయ‌డాన్ని తీవ్రంగా తప్పు ప‌ట్టారు బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్. మ‌తోన్మాదుల‌కు తాను ఎప్పుడూ త‌ల వంచ‌లేద‌ని అన్నారు. బీజేపీ దాని అనుబంధ సంస్థ‌లు బీహార్ ను ఏమీ చేయ‌లేవ‌ని హెచ్చ‌రించారు.

కేంద్రం కావాల‌ని త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోందంటూ ఆరోపించారు. త‌న కోడ‌లు గ‌ర్భ‌వ‌తి అని చూడ‌కుండా ఇబ్బందుల‌కు గురి చేశారంటూ మండిప‌డ్డారు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్(Lalu Prasad Yadav). భూ, స్కాం కేసుల‌కు సంబంధించి ఈడీ శుక్ర‌వారం ఢిల్లీ, రాంచీ, ముంబైతో పాటు 24 ప్రదేశాల‌లో ఏక కాలంలో సోదాలు చేప‌ట్టింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

ఇది క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే త‌ప్పా మ‌రొక‌టి కాద‌న్నారు. కోర్టులు ఉన్నాయ‌ని తాము ఎలా నిరూపించు కోవాలో తెలుస‌న్నారు. ద‌ర్యాప్తు ఏజెన్సీల‌తో భ‌య‌పెట్టాల‌ని అనుకోవ‌డం మానుకోవాల‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఇదే కేసుల‌కు సంబంధించి బీహార్ మాజీ సీఎంలు ర‌బ్రీ దేవితో పాటు లాలూ ప్ర‌సాద్(Lalu Prasad Yadav ED CBI) ల‌ను కూడా విచారించింది. వారి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసింది. 

మార్చి 7న 5 గంట‌ల‌కు పైగా విచారించింది ఈడీ. త‌న కూతురు, మ‌న‌వరాలు, కోడ‌లిని కూడా వేధింపుల‌కు గురి చేశారంటూ ఆరోపించారు మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్. త‌మ‌తో రాజ‌కీయంగా యుద్దం చేసేందుకు ఇంత త‌క్కువ స్థాయికి వ‌చ్చారా అంటూ ట్వీట్ చేశారు మాజీ సీఎం. లాలూ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

Also Read : సిసోడియాకు జైల్లో రాచ‌మ‌ర్యాద‌లు

Leave A Reply

Your Email Id will not be published!