Nitin Gadkari : స్థిరమైన ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యం
తలెంగాణలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
Nitin Gadkari : కామారెడ్డి – దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Nitin Gadkari Praises BJP Govt
రాష్ట్రంలో ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలను పెంచేందుకు తాము తెలంగాణను వేగవంతమైన , స్థిరమైన రహదారులతో అభివృద్ది చేస్తున్నామని స్పష్టం చేశారు నితిన్ గడ్కరీ(Nitin Gadkari). రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు. కేవలం సంక్షేమ పథకాల పేరుతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ఇవాళ అన్ని వర్గాల ప్రజల మద్దతు తమ పార్టీకి లభిస్తోందన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో అందరికీ కొలువులు వచ్చాయని కానీ 40 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు.
బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, కానీ కాంగ్రెస్ , బీఆర్ఎస్ రెండూ ప్రజలను మోసం చేయడం తప్ప వారికి తెలిసింది ఏమీ లేదన్నారు. మొత్తంగా రాబోయే ఎన్నికల్లో తాము కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకుంటామని స్పష్టం చేశారు నితిన్ గడ్కరీ.
Also Read : Revanth Reddy : బీఆర్ఎస్ పతనం ఖాయం