PM Modi : ప‌టేల్ వ‌ల్లే నిజాం పాల‌న‌కు విముక్తి – మోదీ

రాష్ట్రంలో బీజేపీ మ‌రింత విస్త‌రించాలి

PM Modi : భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ అనే వ్య‌క్తి ఈ దేశంలో పుట్టి ఉండ‌క పోతే నేటి అఖండ భార‌త్ ఉండేది కాద‌న్నారు.

అంతే కాదు ఆయ‌న వ‌ల్ల‌నే నేటి తెలంగాణ‌కు విముక్తి ల‌భించింద‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లోని సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌య సంక‌ల్ప్ యాత్ర బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi)  ప్ర‌సంగించారు.

స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ఉక్కు సంక‌ల్పం ముందు ఏ ఒక్క‌రు నిల‌బ‌డ లేక పోయార‌ని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ మ‌రింత ముందుకు వెళుతుంద‌న్నారు. అఖండ శ్రేష్ట్ భార‌త్ ను నిర్మించ‌డ‌మే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు మోదీ.

తెలంగాణ స‌హా ఇత‌ర రాష్ట్రాల‌లో విస్త‌రించాల‌ని దిశా నిర్దేశం చేశారు. ప‌టేల్ కొట్టిన దెబ్బ‌కు నిజాం న‌వాబు దిగి వ‌చ్చాడ‌ని చెప్పారు. పార్టీకి చెందిన శ్రేణులంతా క‌లిసి క‌ట్టుగా ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు.

తెలంగాణ‌తో పాటు కేర‌ళ‌, ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు , త‌దిత‌ర బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల‌లో సైతం పార్టీ శ్రేణులు చేస్తున్న కృషి గొప్ప‌ద‌న్నారు. 2019 నుంచి తెలంగాణ‌లో బీజేపీ మ‌రింత పుంజుకుంటోంద‌ని మోదీ చెప్పారు.

ప్ర‌జ‌ల ఆశీర్వాద బ‌లంతో ప‌లు రాష్ట్రాల‌లో అధికారంలోకి భార‌తీయ జ‌న‌తా పార్టీ వ‌చ్చింద‌న్నారు ప్ర‌ధాన మంత్రి. రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీ తెలంగాణ‌ను కైవ‌సం చేసుకోవాల‌ని, ఆ దిశ‌గా పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

Also Read : ఆద‌ర‌ణ అద్భుతం తెలంగాణ‌కు అభివంద‌నం

Leave A Reply

Your Email Id will not be published!