NRI Student Killed : ఎన్నారై స్టూడెంట్ దారుణ హత్య
పోలీసుల అదుపులో కొరియా స్టూడెంట్
NRI Student Killed : అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు(NRI Student Killed). ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ప్రవాస భారతీయ కుటుంబం కిడ్నాప్ కు గురై ఓ తోటలో శవాలై తేలారు. పర్డ్యూ యూనివర్శిటీలో చదువుతున్న ఇండియానా పోలీస్ కు చెందిన వరుణ్ మనీష్ ఛేడా అమెరికా లోని ఇండియానా రాష్ట్రంలోని తన డార్మిటరీ లో శవమై కనిపించాడు.
రూమ్ మేట్ అయిన దక్షిణ కొరియాకు చెందిన స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదిలా ఉండగా వరుణ్ మనీష్ ఛేడా పర్డ్యూ యూనివర్శిటీలో డేటా సైన్స్ చదువుతున్నాడు. ఇండియానా రాష్ట్రంలోని తన వసతి గృహంలో 20 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన విద్యార్థి హత్యకు గురయ్యాడు.
కొరియన్ రూమ్ మేట్ పైనే అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. యూనివర్శిటీ క్యాంపస్ పశ్చిమ అంచున ఉన్న మెక్ కట్చియాన్ హాల్ లో శవమై కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే ఘటనకు సంబంధించి యూనివర్శిటీ విద్యార్థిని అరెస్ట్ చేశారు.
అమెరికన్ న్యూస్ ఏజెన్సీ ఎన్బీసీ న్యూస్ పోలీస్ చీఫ్ ను ఉటంకిస్తూ పేర్కొంది. కొరియాకు చెందిన జి మిన్ జిమ్మి సైబర్ సెక్యూరిటీ కోర్సు చదువుతున్నాడు. ఈ విషయం గురించి పోలీసులను అప్రమ్తతం చేసినట్లు సమాచారం. చివరకు అతడినే ప్రధాన అనుమానితుడిగా గుర్తించినట్లు పర్ద్యూ పోలీస్ చీఫ్ లెస్లీ వైట్ తెలిపారు.
ఇదిలా ఉండగా కాల్ వివరాలు వెల్లడించలేదు. మెక్ కడ్చియాన్ హాల్ మొదటి అంతస్తు లోని ఓ గదిలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
Also Read : కిడ్నాపైన ఎన్నారై ఫ్యామిలీ దారుణ హత్య