Pawan Kalyan : వాలంటీర్ల‌కు బాస్ ఎవ‌రో చెప్పాలి

జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan  : ఏపీలో కొన‌సాగుతున్న వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పై మ‌రోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. పౌరుల‌కు సంబంధించిన డేటా సేక‌ర‌ణ‌పై వైసీపీ ప్ర‌భుత్వం స్ప‌ష్టత ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఇంత‌కు వాలంటీర్ల ను ఏ ప‌ద్ద‌తిలో ఎంపిక చేశారు. దేని కోసం, ఎవ‌రి ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు వారిని నియ‌మించారో చెప్పాల‌ని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

Pawan Kalyan Words

ప్ర‌జ‌ల‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో తీసుకోకూడ‌దంటూ ఇప్ప‌టికే సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింద‌ని తెలిపారు. కానీ ప్ర‌భుత్వం ఇందుకు విరుద్దంగా వాలంటీర్ల ద్వారా ఎందుకు సేక‌రిస్తోదంటూ ప్ర‌శ్నించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan). ఒక‌వేళ డేటా సేక‌రిస్తే దానికి ఎవ‌రు ప‌ర్మిష‌న్ ఇచ్చారు. వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పై ఎవ‌రికి ప‌ట్టు ఉందో చెప్పాల‌న్నారు.

ప్ర‌త్యేకించి ఈ మొత్తం వ్య‌వ‌హారానికి ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తున్నారో స్ప‌ష్టం చేయాల‌ని పేర్కొన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు.

గ‌త కొంత కాలం నుంచి జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి విజ‌య యాత్ర‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. తొలి విడ‌త స‌క్సెస్ అయ్యింది. రెండో విడ‌త కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో ఎన్డీయే మీటింగ్ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అటెండ్ అయ్యారు.

Also Read : Sake Sailajanath : మ‌ణిపూర్ స‌ర్కార్ ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి

 

Leave A Reply

Your Email Id will not be published!