Pawan Kalyan : రౌడీలు ఎంపీలైతే ఏం మాట్లాడ‌తారు

నిప్పులు చెరిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అధికార వైసీపీ ఎంపీల‌పై నిప్పులు చెరిగారు. రౌడీలు ఎంపీలైతే ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి ఏం మాట్లాడ‌తారంటూ నిల‌దీశారు. మూడో విడ‌త వారాహి విజ‌య యాత్ర సంద‌ర్భంగా ప‌వ‌న్ ప్ర‌సంగించారు. బుగ్గలు నిమ‌ర‌డం, ముద్దులు పెట్ట‌డం, త‌ల మీద చెయ్యి పెట్ట‌డం త‌ప్ప జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీకి చేసింది ఏమీ లేద‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

Pawan Kalyan Slams YSRCP MP’s

ఓ వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కార్మికులు, ఉద్యోగులు రోడ్డెక్కితే ఎందుకు సీఎం స్పందించ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. కేంద్రానికి జ‌గ‌న్ స‌రెండ‌ర్ అయ్యాడ‌ని అందుకే ఆయ‌న కానీ , పార్టీ త‌ర‌పున ఎన్నికైన ఎంపీలు కానీ నోరు మెద‌ప‌ర‌న్నారు.

22 మందిని గెలిపిస్తే ఒక్క‌డు కూడా పార్ల‌మెంట్ లో ప్ల కార్డు ప‌ట్టుకునేందుకు భ‌య‌ప‌డ్డార‌ని ఎద్దేవా చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan). విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అన్న నినాదం ఇంకా నాలో మారుమ్రోగుతూనే ఉంద‌న్నారు . కేంద్రంతో పోరాడాల్సిన జ‌గ‌న్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియాల‌న్నారు.

కాంట్రాక్టుల కోసం, త‌న కేసుల నుంచి ర‌క్షించు కునేందుకు కేంద్రం కాళ్లు ప‌ట్టుకుంటారు త‌ప్పా జ‌నం స‌మ‌స్య‌లు ప‌ట్టించు కోడ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : Atirudra Yagam : ఘ‌నంగా అతిరుద్ర యాగం ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!