Pawan Kalyan : ఇళ్లను కూల్చేస్తే సర్కార్ కూలుతుంది
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో రాచరిక పాలన సాగుతోంది. పోలీసు వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందింది. ఎవరైనా రేప్ కు పాల్పడితే వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ ఈ రాష్ట్రంలో అందుకు భిన్నంగా సాగుతోంది. ఏకంగా బాధితులను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఖాకీలపై కన్నెర్ర చేశారు జనసేన చీఫ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).
ఇళ్లను కోల్పోయిన వారిని వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులను పరామర్శించారు పవన్ కళ్యాణ్. రోడ్ల విస్తరణ పేరుతో ఇలా చేస్తారా , ఒకవేళ మీకు సంబంధించిన వారి ఇళ్లను ఖాళీ చేస్తే ఇలాగే ఊరుకుంటారా అని ప్రశ్నించారు.
జనసేన సభకు స్థలం ఇచ్చిన వారిని ప్రధానంగా టార్గెట్ చేశారంటూ ఆరోపించారు. ఇప్పటం ఏమన్నా విజయవాడనా లేక కాకినాడనా లేక రాజమండ్రా రోడ్లు విస్తరించేందుకు అంటూ నిలదీశారు. ఇతర పార్టీలను ఇబ్బందులకు గురి చేయడం తప్ప ఇంకేమీ ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదన్నారు పవన్ కళ్యాణ్.
గాంధీ, ఇందిరా గాంధీల విగ్రహాలు కూల్చి వేసి రోడ్లు నిర్మిస్తే ఎలా అని నిప్పులు చెరిగారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అధికారం శాశ్వతం అనుకుంటున్నాడని అలాంటి వారు చరిత్రలో కలిసి పోయారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో వైసీపీకి తగిన రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan).
ఇక నుంచైనా ఏపీ పోలీసులు తమ తీరు మార్చు కోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
Also Read : పవన్ ఇంటి వద్ద రెక్కీ అబద్దం