Pawan Kalyan : స‌త్య‌దేవుని స‌న్నిధిలో జ‌న‌సేనాని

పూజ‌లు నిర్వ‌హించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బుధ‌వారం ఏపీలో వారాహి యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా ప్ర‌ముఖ దేవాల‌యం అన్న‌వ‌రంకు చేరుకున్నారు. అక్క‌డ కొలువై ఉన్న స‌త్య‌నారాయ‌ణ స్వామి స‌న్నిధిలో పూజ‌లు చేశారు. ఆయ‌న‌కు పూజారులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌న‌ను చూసేందుకు భారీగా త‌ర‌లి వ‌చ్చారు అభిమానులు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెంట జ‌న‌సేన సీనియ‌ర్ నాయ‌కుడు , మాజీ ఏపీ ఉమ్మ‌డి స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఉన్నార‌. ఆయ‌న‌తో పాటు ఏపీలోని ఆయా జిల్లాల‌, నియోజ‌క‌వ‌ర్గాల బాధ్యులు కూడా భారీగా త‌ర‌లి వ‌చ్చారు. దీంతో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్ లో జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) దేశం, రాష్ట్ర ప్ర‌జ‌లు బాగుండాల‌ని యాగం చేప‌ట్టారు.

అనంత‌రం జూన్ 14 నుంచి వారాహి ప్ర‌చార ర‌థం ద్వారా ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టారు. మ‌రో వైపు తెలుగుదేశం ఇప్ప‌టికే ప్ర‌చారంలో మునిగి పోయింది. ఇక యువ‌గ‌ళం పేరుతో నారా లోకేష్ కూడా ప్ర‌చారం చేప‌ట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న రాయ‌ల‌సీమ‌లో పూర్తి చేశారు. ప్ర‌స్తుతం నెల్లూరులో ఎంట‌ర్ అయ్యారు. దీంతో ఏపీలో రాజ‌కీయం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాట్ టాపిక్ గా మారారు. నెట్టింట్లో వైర‌ల్ గా నిలిచారు.

Also Read : Arvind Kejriwal : కేజ్రీవాల్ పోరాటానికి సీపీఐ మ‌ద్ద‌తు

 

Leave A Reply

Your Email Id will not be published!