PM Modi : దళితులకు ఖుష్ కబర్ చెప్పారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కమిటీని త్వరితగతిన చేసేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా క్యాబినెట్ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరపాలని సూచించారు.
PM Modi Good News
ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా ఉమ్మడి ఎపీలో , తెలంగాణ ఏర్పాటు అయ్యాక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్ఎపీఎస్) చీఫ్ మందకృష్ణ మాదిగ అలుపెరుగని రీతిలో పోరాటం చేస్తూ వచ్చారు. ఆయన ప్రతి పార్టీ చీఫ్ లతో కలిశారు. అన్ని ప్రభుత్వాలకు ఎస్సీ వర్గీకరణ త్వరితగితిన చేపట్టాలని కోరుతూ విన్నవించారు.
కేవలం ఎస్సీ వర్గీకరణ ఎవరు చేస్తూ వారికి తాము బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రిని(PM Modi) కలుసుకున్నారు. ఈ మేరకు పీఎం సపోర్ట్ గా నిలిచారు. మంద కృష్ణ మాదిగ ఆద్వర్యంలో విశ్వ రూప సభను చేపట్టారు. ఈ సభకు భారీ ఎత్తున మాదిగ సోదరులు తరలి వచ్చారు.
ఎస్సీలకు సంబంధించి ఏ, బీ, సీ, డీ కేటగిరీ కింద రిజర్వేషన్లు సమకూర్చి పెట్టాలని విన్నవించారు. ఇందుకు మోదీ ఓకే చెప్పారు. ఇందులో భాగంగానే కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించడం విశేషం.
Also Read : Harish Rao : కాంగ్రెస్ కు అంత సీన్ లేదు