PM Modi : సైనికులతో ఉండటమే నిజమైన దీపావళి
స్పష్టం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
PM Modi : ఈ దేశం కోసం మీరు చేస్తున్న కృషి మాటల్లో చెప్పలేను. మీరు లేక పోతే దేశం లేదు. మీతో గడపడంతో నా జన్మ ధన్యమైంది. మీతో కలిసి ఉండటమే నిజమైన దీపావళి అని ప్రశంసలతో ముంచెత్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) . కార్గిల్ లో ఉన్న సైనిక బృందాలతో మమేకమయ్యారు మోదీ.
ఈ సందర్బంగా వారితో చాలా సేపు ముచ్చటించారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రిగా కొలువు తీరిన 2014 నుంచి నేటి దాకా ప్రతి ఏటా దీపావళి పండుగ రోజున సైన్యంతో గడుపుతున్నారు. వారితో కలిసి సోమవారం పండుగను జరుపుకుంటున్నారు. వివిధ సైనిక బృందాలను సందర్శించారు.
లడఖ్ లోని కార్గిల్ లో ప్రస్తుతం ఉన్నారు మోదీ. అక్కడ మోహరించిన సైనికులతో కరచాలనం చేశారు. వారితో ఉల్లాసంగా గడిపారు. వారితో కలిసి ఉండకుండా దీపావళిని తాను ఊహించ లేనన్నారు. కార్గిల్ లో విజయ పతాకం ఎగురవేయని చోట పాకిస్తాన్ తో యుద్దం జరగలేదన్నారు.
సైనికులంతా తన కుటుంబం అని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి(PM Modi) . ఉగ్రవాదంపై పోరులో సాయుధ బలగాలు చేస్తున్న కృషి అసామన్యమన్నారు. కార్గిల్ లో మన సైనికులు ఉగ్రవాదాన్ని అణిచి వేశారు. ఈ సంఘటనకు తాను సాక్షినని పేర్కొన్నారు. నేను ఇక్కడకు వచ్చినప్పుడు యుద్ద సమయంలో సైనికులతో నేను గడిపిన క్షణాల చిత్రాలను వారికి చూపించానని చెప్పారు.
ఇది ఆ అద్భుతమైన జ్ఞాపకాలను తిరిగి తెచ్చిందన్నారు నరేంద్ర మోదీ. ఉదయాన్నే కార్గిల్ కు చేరుకున్న మోదీ దేశంలోని ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : కోహ్లీ అద్భుతం భారత్ విజయం – మోదీ