PM Modi : గుజ‌రాత్ కు రుణ‌ప‌డి ఉన్నా – మోదీ

మీ మేలు జీవితంంలో మ‌ర్చి పోలేను

PM Modi : గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి అఖండ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్ట‌డంతో స్పందించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ప్ర‌జ‌లంద‌రికీ జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని అన్నారు. 1985 నుంచి గుజ‌రాత్ రాష్ట్రంలో వ‌రుస‌గా బీజేపీ గెలుస్తూ వ‌స్తోంది. ఇది ఏడోసారి కొలువు తీర‌డం. భార‌త దేశ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో ఒక పార్టీ కంటిన్యూగా ఏడుసార్లు ఎన్నిక కావ‌డం అనేది ఇప్ప‌టి వ‌ర‌కు ప‌శ్చిమ బెంగాల్ లో సీపీఎం ఉండేది.

ఆ త‌ర్వాత ఆ రికార్డును స‌మం చేసింది బీజేపీ గెలుపుతో. ఇక్క‌డ ప్ర‌ధాన‌మంత్రి మోదీ(PM Modi) సీఎంగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత గుజ‌రాత్ మోడ‌ల్ పేరుతో దేశ వ్యాప్తంగా ప్ర‌చారం చేశారు. స‌క్సెస్ అయ్యారు. ప్ర‌స్తుతం ఊహించ‌ని రీతిలో అత్య‌ధిక స్థానాల‌ను క‌ట్ట‌బెట్ట‌డంతో సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఎన్ని హామీలు గుప్పించినా ప్ర‌జ‌లు త‌మ వైపు ఉన్నార‌ని నిరూపించార‌ని అన్నారు మోదీ. గుజరాత్ లో బీజేపీ క‌మాల్ చేసింద‌ని పేర్కొన్నారు పీఎం.

గుజ‌రాత్ లో అద్భుత విజ‌యాన్ని క‌ట్టబెట్టిన అనంత‌రం భార‌తీయ జ‌న‌తా పార్టీ హెడ్ క్వార్ట‌ర్స్ లో ఏర్పాటు చేసిన విజ‌యోత్స‌వ స‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి మోదీ మాట్లాడారు. తాను చేసిన రికార్డును బ్రేక్ చేయాల‌ని సీఎం భూపేంద్ర ప‌టేల్ ను కోరాన‌ని అన్నారు. గుజ‌రాత్ రాష్ట్ర ప్ర‌జ‌లు అదే చేసి చూపించార‌ని ప్ర‌శంసించారు. స‌రికొత్త సృష్టించార‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని అన్నారు.

క‌ష్టానికి త‌గిన ఫ‌లితం దొరికింద‌న్నారు మోదీ. కొన్ని రాజ‌కీయ పార్టీలు త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం హామీలు ఇస్తున్నార‌ని ఆరోపించారు. అయితే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో కేవ‌లం ఒకే ఒక్క శాతం ఓట్ల‌తో ఓట‌మి పాల‌య్యామ‌ని పేర్కొన్నారు మోదీ(PM Modi).

Also Read : గుజ‌రాత్ లో బీజేపీ క‌మాల్

Leave A Reply

Your Email Id will not be published!