Pocharam Srinivas Reddy : గెలుస్తా మ‌ళ్లీ వ‌స్తా – పోచారం

నిజాయితీప‌రుల‌ను ఎన్నుకోండి

Pocharam Srinivas Reddy : తెలంగాణ రాష్ట్ర శాస‌న స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల్లో భాగంగా ఆయ‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అంత‌కు ముందు జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో డ్యాన్సు కూడా చేశారు. మొత్తంగా తాను ఏనాడూ ప‌దవుల‌ను కోరుకోలేద‌ని అన్నారు. వాటంట‌త అవే త‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చాయ‌ని చెప్పారు. త‌న గెలుపున‌కు ఢోకా లేద‌న్నారు పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి.

Pocharam Srinivas Reddy Comment

నిజాయితీ ప‌రుల‌ను , ప‌ని చేసే వారిని, సేవ‌లు అందించే వారిని, నిత్యం 24 గంట‌ల పాటు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న వారిని ఎన్నుకోవాల‌ని సూచించారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో తెలంగాణ‌లో అభివృద్ధి ప‌నులు, సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

ముందు చూపు క‌లిగిన నాయ‌కుడు సీఎం కేసీఆర్ అని, ఆయ‌న సారథ్యంలో ఇవాళ అన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో ఉన్నార‌ని చెప్పారు పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy). ఒక‌ప్పుడు క‌రువుకు ఆల‌వాల‌మైన తెలంగాణ ఇవాళ ప‌చ్చ‌ని పంట‌ల‌తో క‌ళ క‌ళ లాడుతోంద‌ని అన్నారు. తాము 119 సీట్ల‌కు గాను 100 సీట్ల‌లో గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

Also Read : BRS JOBS : జాబ్స్ భ‌ర్తీలో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్

Leave A Reply

Your Email Id will not be published!