Ponniyin Selvan : వ‌సూళ్ల‌లో పొన్నియిన్ సెల్వ‌న్ హ‌వా

వ‌సూళ్ల‌లో దూసుకు పోతున్న మ‌ణిర‌త్నం మూవీ

Ponniyin Selvan : మ‌ణిర‌త్నం దర్శ‌క‌త్వం వ‌హించిన పొన్నియిన్ సెల్వ‌న్ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. అక్టోబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై వ‌సూళ్ల‌ను తిర‌గరాస్తోంది. ఇప్ప‌టికే రూ. 400 కోట్లకు పైగా వ‌సూళ్లు చేసిన‌ట్లు స‌మాచారం. త‌మిళ‌నాడులో ఊహించ‌ని ఆద‌ర‌ణ ల‌భిస్తోంది ఈ మూవీకి.

ఇందులో ఐశ్వ‌ర్యా రాయ్ , విక్ర‌మ్ , కార్తీ, త్రిష‌, జ‌యం ర‌వి న‌టించారు. ఇది పీరియాడిక‌ల్ డ్రామా. ఈ ఏడాదిలో అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన రెండో హిందీ చిత్రంగా నిలించింది. మొద‌టి చిత్రం కాశ్మీర్ ఫైల్స్ . పొన్నియిన్ సెల్వ‌న్(Ponniyin Selvan) 9వ రోజు వ‌ర‌కు చూస్తే క‌లెక్ష‌న్లు రూ. 14 నుంచి 15 కోట్ల దాకా వ‌సూలు చేసింది.

వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లైన అన్ని థియేట‌ర్ల‌లో దుమ్ము రేపుతోంది. క‌ల్కి కృష్ణ‌మూర్తి 1955లో రాసిన చారిత్ర‌క కాల్పానిక న‌వ‌ల ఆధారంగా పొన్నియ‌న్ సెల్వ‌న్ -1 ను అద్భుతంగా తెర కెక్కించే ప్ర‌య‌త్నం చేశారు మ‌ణిర‌త్నం. గొప్ప చోళ రాజు గురించి ఇందులో ప్ర‌ధానంగా వివ‌రిస్తుంది. దీనిని జ‌యం ర‌వి పోషించారు.

అత్యంత ధైర్య‌వంతుడిగా, సాహ‌సోపేత‌మైన యోధుడిగా వంతీయతేవ‌న్ పాత్ర‌లో న‌టించ‌డం గొప్ప‌గా ఉంద‌న్నాడు. ఈ క్రెడిట్ అంతా ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంకు ద‌క్కుతుంద‌న్నారు. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన పొన్నియిన్ సెల్వ‌న్ ఆశించిన దాని కంటే అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టింది.

అల్లీ రాజా సుభాస్క‌ర‌న్ కు చెందిన లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ మ‌ద్ద‌తుతో పొన్నియిన్ సెల్వ‌న్ మూవీని త‌మిళం, హిందీ, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో విడుద‌ల చేశారు. ప్ర‌తి చోటా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది పొన్నియిన్ సెల్వ‌న్.

Also Read : గాడ్ ఫాద‌ర్ స‌క్సెస్ వెనుక మ‌సూద్ భాయ్

Leave A Reply

Your Email Id will not be published!