Nitish Kumar PK : బీజేపీ కోసం ప‌ని చేస్తున్న పీకే – నితీశ్

బీహార్ సీఎం సంచ‌ల‌న కామెంట్స్

Nitish Kumar PK : జేడీయూ చీఫ్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ,, ఐపాక్ ఫౌండ‌ర్ ప్ర‌శాంత్ కిషోర్ పై నిప్పులు చెరిగారు. త‌న‌పై గ‌త కొంత కాలంగా అవాకులు చెవాకులు పేలుతూ వ‌స్తున్న పీకేపై(Nitish Kumar PK) భ‌గ్గుమ‌న్నారు సీఎం. ఆయ‌న చాలా మాట్లాడతాడు. కానీ అస‌లైన విష‌యాలు దాస్తాడ‌ని ఆరోపించారు.

నేను పిల‌వ‌కుండానే ప్ర‌శాంత్ కిషోర్ నా వ‌ద్ద‌కు వ‌చ్చాడు. ఈ విష‌యం నాకంటే బాగా పీకేకు తెలుస‌న్నారు. కానీ బ‌య‌ట‌కు మాత్రం తానే ఆయ‌న‌ను క‌లిసిన‌ట్లు ప్ర‌చారం జ‌ర‌గ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు నితీశ్ కుమార్. ఒక‌ప్పుడు త‌న పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలంటూ ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌పోజ్ చేశార‌ని సంచ‌ల‌న ఆరోణ‌లు చేశారు.

జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ వ‌ర్దంతి సంద‌ర్భంగా సీఎం నితీశ్ కుమార్ నివాళులు అర్పించారు. సోష‌లిస్టు దిగ్గ‌జం జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ జ‌న్మ స్థ‌ల‌మైన సితాబ్ దియారాలో సీఎం మీడియాతో మాట్లాడారు. ప్ర‌శాంత్ కిశోర్ కేవ‌లం భార‌తీయ జ‌న‌తా పార్టీ కోసం మాత్ర‌మే ప‌ని చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

ఆయ‌న చెప్పేవ‌న్నీ పైకి ఒక‌లా ఉంటాయ‌ని కానీ లోప‌టి ఎజెండా మాత్రం వేరుగా ఉంటుంద‌న్నారు నితీశ్ కుమార్. ఇదిలా ఉండ‌గా జేడీయూకి నాయ‌క‌త్వం వ‌హించాలంటూ తాను పీకేను కోరిన‌ట్లు చెప్ప‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇదంతా పొలిటిక‌ల్ స్టంట్ త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు.

పీకేకు మాట్లాడే హ‌క్కు ఉంది. కానీ ఆయ‌న విచ‌క్ష‌ణ కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఎవ‌రు ఎవ‌రిని క‌లిశారో రాష్ట్ర ప్ర‌జ‌లకు, దేశానికి తెలుస‌న్నారు నితీశ్ కుమార్.

Also Read : కేంద్రంపై భ‌గ్గుమ‌న్న తేజ‌స్వి యాద‌వ్

Leave A Reply

Your Email Id will not be published!