Raghav Chadha : జైళ్లంటే మాకు భ‌యం లేదు – రాఘ‌వ్ చ‌ద్దా

కేంద్రం అనుస‌రిస్తున్న తీరు దారుణం

Raghav Chadha BJP Govt : ఆప్ ఎంపీ , పంజాబ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు రాఘ‌వ్ చద్దా షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము నిబ‌ద్ద‌త క‌లిగిన నాయ‌కులుగా ఉన్నామ‌ని , తమ పార్టీ సామాన్యుల కోసం ప‌ని చేస్తుంద‌న్నారు. సోమ‌వారం రాఘ‌వ్ చ‌ద్దా మీడియాతో మాట్లాడారు. కేంద్రం కావాల‌ని వేధింపుల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే నిజాలు నిల‌క‌డ‌గా తెలుస్తాయ‌న్నారు. వేధింపుల‌కు గురి చేయ‌డం, కేసుల‌తో భ‌య పెట్ట‌డం, జైళ్ల‌కు త‌ర‌లించాల‌ని భ‌య‌పెడితే తాము భ‌య‌ప‌డే వాళ్లం కాద‌ని హెచ్చ‌రించారు రాఘ‌వ్ చ‌ద్దా(Raghav Chadha BJP Govt).

ముందు కేంద్రం లో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ దాని అనుబంధ సంస్థ‌లు ఎవ‌రి కోసం ప‌ని చేస్తున్నాయో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు. తాము పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ఉన్నామ‌ని చెప్పారు. మా స‌మ‌స్య‌ల‌ను ఎద‌ర్కొనే స‌త్తా ఆప్ కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. కేంద్ర సంస్థ‌ల దుర్వినియోగం గురించి దేశ ప్ర‌జ‌ల‌కు తెలియ చేస్తామ‌ని చెప్పారు రాఘ‌వ్ చ‌ద్దా. అక్ర‌మ ప‌ద్ద‌తుల్లో లేదా హింసాత్మ‌క చ‌ర్య‌ల‌కు తాము ఎప్పుడూ ముందుకు వెళ్ల‌బోమ‌ని పేర్కొన్నారు ఎంపీ.

నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తూ కావాల‌ని ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. దీనిని తాము త‌ప్ప‌కుండా ఎదుర్కొంటామ‌ని హెచ్చ‌రించారు రాఘ‌వ్ చ‌ద్దా. జైళ్ల‌కు వెళ్ల‌డం త‌మ‌కు కొత్త కాద‌న్నారు. తాము ఒంట‌రిగా లేమ‌ని త‌మ వెంట దేశ ప్ర‌జ‌లు ఉన్నార‌ని అన్నారు.

జైలుకు వెళ్లేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని చెప్పారు రాఘ‌వ్ చ‌ద్దా(Raghav Chadha). ఈ స‌మ‌స్య‌కు ఒక వ్య‌క్తికి లేదా ఒక పార్టీకి ప‌రిమితం కాద‌న్నారు. సంజ‌య్ రౌత్ , తేజ‌స్వి యాద‌వ్ , క‌విత‌, మ‌నీష్ సిసోడియా వీళ్లంద‌రిపై కావాల‌ని కేసులు పెట్టార‌ని ఆరోపించారు.

Also Read : రిజిజుతో సీఎం సంగ్మా భేటీ

Leave A Reply

Your Email Id will not be published!