Devendra Fadnavis Rahul : అయోధ్యకు రాహుల్ ను పిలుస్తాం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్
Devendra Fadnavis Rahul : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం త్వరలోనే పూర్తవుతుందన్నారు. జనవరి 1, 2024న ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారని చెప్పారు. రామ మందిర నిర్మాణం యుద్ద ప్రాతిపదికన కొనసాగుతోందన్నారు.
ఇదిలా ఉండగా మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన సదస్సుకు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాహుల్ గాంధీని రామాలయంలో దర్శనానికి ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. ఇదిలా ఉండగా ఉండగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, మోదీని , హిందూ సంస్థలను ఏకి పారేస్తున్నారు రాహుల్ గాంధీ.
ఇదిలా ఉండగా ఆయన యాత్రకు ఊహించని రీతిలో రామాలయం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తో పాటు రామ మందిర నిర్మాణ ట్రస్టు కార్యదర్శి రాయ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూజారి లేఖ రాస్తూ రాహుల్ చేపట్టిన విజయవంతం కావాలని కోరారు. మరో వైపు రాయ్ తాము ఎన్నడూ రాహుల్(Rahul Gandhi) పాదయాత్రపై విమర్శలు చేయలేదన్నారు.
దేశం కోసం హితం కోసం చేసే ఏదానినైనా తాము మద్దతు ఇస్తామన్నారు. కానీ విద్వేషాలు ఎవరు రెచ్చ గొడుతున్నారో ప్రజలకు తెలుసన్నారు. ఇదిలా ఉండగా అమిత్ షా రాహుల్ గాంధీ పదే పదే లేవదీస్తున్న రామ మందిరం పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఇప్పుడు విస్మరించ లేని నేతగా మారారు.
Also Read : లవ్లీ ‘లూనా’ రాహుల్ థిల్లానా