Jairam Ramesh : జోడో యాత్ర ఎన్నిక‌ల యాత్ర కాదు – జైరాం

దేశం కోసం ప్ర‌జ‌ల కోసం చేస్తున్న యాత్ర

Jairam Ramesh : ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి కోసం రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర చేప‌ట్ట‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, పార్టీ మీడియా ఇంఛార్జ్ జైరాం ర‌మేష్(Jairam Ramesh). శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు యాత్రకు ఊహించ‌ని రీతిలో మ‌ద్ద‌తు ల‌భిస్తోంద‌న్నారు.

దీనిని త‌ట్టుకోలేక బీజేపీ వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు, ఆరోప‌ణ‌ల‌కు దిగుతోంద‌న్నారు. వాళ్ల‌కు అంతకు మించి ఏం మాట్లాడ‌గ‌ల‌ర‌ని మండిప‌డ్డారు. నిన్న‌టి వ‌ర‌కు ప‌ప్పు అన్న వాళ్లు రాహుల్ గాంధీని చూసి జ‌డుసుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. ఇది రాజ‌కీయాల‌కు సంబంధించిన ఎన్నిక‌ల యాత్ర కానే కాద‌న్నారు జైరాం ర‌మేష్‌.

ఇది దేశం కోసం, 140 కోట్ల భార‌తీయుల కోసం చేస్తున్న పాద‌యాత్ర అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రినీ ప‌ల్లెత్తు మాట అన‌లేద‌న్నారు. కానీ ఆయ‌న త‌ప‌న అంతా ఈ దేశం విద్వేషాల‌తో ఉండ‌కూడ‌ద‌ని, ప్ర‌తి ఒక్క‌రు క‌లిసి బ‌త‌కాల‌న్న‌దే త‌న కోరిక అని చెప్పారు.

విచిత్రం ఏమిటంటే అయోధ్య లోని రామ మందిరం ప్ర‌ధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఏకంగా రాహుల్ గాంధీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తార‌ని తెలిపారు జై రమేష్‌(Jairam Ramesh). అంతే కాదు భార‌త్ జోడో యాత్ర విజ‌య‌వంతం కావాల‌ని ఆ శ్రీ‌రాముడు ఆశీస్సులు రాహుల్ కు ఉంటాయ‌ని పేర్కొన్నారని తెలిపారు.

ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి కోసం ఏనాడూ పాకులాడ లేద‌ని స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయాల‌కు అతీతంగా కొన‌సాగుతున్న ఈ యాత్ర‌కు అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంద‌ని చెప్పారు.

Also Read : రాహుల్ యాత్ర‌లో ‘శున‌క’ రాజ‌సం

Leave A Reply

Your Email Id will not be published!