Rahul Gandhi : బేటీ బచావో అనేది ఓ వంచన – రాహుల్
మహిళా రెజ్లర్లపై ఖాకీల దౌర్జన్యం తగదు
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దేశ రాజధాని ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన మహిళా రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు దాడి చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా తలవంచుకునేలా చేసిందని వాపోయారు. బేటీ బచావో బేటీ పడావో అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారం తప్పా ఆచరణలో దానికి భిన్నంగా ఉందన్నారు. ఇదంతా వంచన అని పేర్కొన్నారు.
ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఇది కేవలం బీజేపీ పాలనలో కొనసాగుతోందన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కుమార్తెలను చిత్రహింసలకు గురి చేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని ధ్వజమెత్తారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మంది మహిళా రెజ్లర్లు రోడ్డు పైకి వచ్చారని కానీ ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించక పోవడం దారుణమన్నారు. ఓ వైపు సుప్రీంకోర్టు చెబితే కానీ ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయలేదని ఇదేనా డెమోక్రసీ అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ.
ఇక ఏం ముఖం పెట్టుకుని మోదీ మాట్లాడతారంటూ నిలదీశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇదిలా ఉండగా డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై మహిళా రెజ్లర్లు(Women Risers) సంచలన ఆరోపణలు చేశారు. తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ వాపోయారు.
Also Read : పవార్ వ్యవహారం రాహుల్ జోక్యం